నేషనల్ క్రష్ రష్మిక మందన( Rashmika Mandana ) ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.బాలీవుడ్ సినిమాలతో పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోలకు జోడిగా నటించాలని ఈ ముద్దుగుమ్మ కోరుకుంది.
కానీ ఆశించిన స్థాయిలో హిందీలో అవకాశాలు రావడం లేదు.అదే సమయంలో తెలుగు లో స్టార్ హీరోలు ఈమెని పట్టించుకోవడం లేదు.
దాంతో మళ్లీ నితిన్( Nitin ) కి జోడి గా వెంకీ కుడుముల( Venky Kudumula ) దర్శకత్వం లో సినిమా ను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఉగాది సందర్భంగా ఆ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
రష్మిక మందన్నా ఆ మధ్య 4 కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ గా డిమాండ్ చేస్తుందనే ప్రచారం జరిగింది.ఆ వార్తల్లో నిజమెంతో కానీ నితిన్ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు గాను ఈమె కేవలం రెండున్నర కోట్ల రూపాయలను మాత్రమే తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఈ రెమ్యూనరేషన్ కూడా సౌత్ లో కాస్త ఎక్కువే అనుకోవాలి. పుష్ప సినిమా కోసం దాదాపు నాలుగు కోట్ల రూపాయలను ఆమె తీసుకుంటుందని ప్రచారం జరుగుతుంది.అన్ని సినిమాలకు కూడా అదే స్థాయిలో రెమ్యూనరేషన్ కావాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇతర నిర్మాతలు తమ వల్ల కాదని చేతులెత్తేశారు.దాంతో తన రెమ్యూనరేషన్ తగ్గించుకుని నితిన్ సినిమా కోసం నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో భీష్మ సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ సినిమాకి సీక్వెల్ అన్నట్లుగా ఈ కొత్త సినిమా రూపొందుతుందా అనే ప్రచారం జరుగుతుంది.
కానీ ఆ వార్తలు నిజం కాదని చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల క్లారిటీ ఇచ్చారు.రష్మిక మందన్నా బాలీవుడ్ లో చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.
దాంతో మరో అవకాశం కోసం ఈ అమ్మడు వెయిట్ చేస్తోంది.