సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కన్నడ భామ రష్మిక మందన ఇప్పుడు తన అడుగులు మెల్లగా బాలీవుడ్ వైపు వేస్తుంది.తెలుగులో ఇప్పటికే తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకొని స్టార్ హీరోలకి ఛాయస్ గా మారిపోయిన ఈ అమ్మడు నెక్స్ట్ లెవల్ అంటూ బాలీవుడ్ లో ఇప్పటికే వరుసగా రెండు సినిమాలకి కమిట్ అయ్యింది.
అందులో సిద్ధార్ద్ మల్హోత్రాకి జోడీగా చేస్తున్న మిషన్ మజ్ఞు సినిమా షూటింగ్ దశలో ఉంది.అలాగే అమితాబచ్చన్ మనవరాలుగా చేస్తున్న గుడ్ బై సినిమా కూడా షూటింగ్ కి సిద్ధం అవుతుంది.
మరో వైపు తెలుగులో పుష్ప, ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలు చేస్తూ ఉంది.అలాగే త్రివిక్రమ్, మహేష్ సినిమా కోసం రష్మికని సంప్రదిస్తున్నట్లు టాక్ నడుస్తుంది.
అఖిల్ ఏజెంట్ సినిమా కోసం రష్మికని ఎంపిక చేసారనే సమాచారం.
తెలుగులో వరుసగా పెద్ద ప్రాజెక్ట్ లు చేస్తూనే బాలీవుడ్ లో పాగా వేయడానికి రెడీ అవుతుంది.
ఇప్పటికే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న కన్నడ భామ పూజా హెగ్డే ఓ వైపు బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్ లని లైన్ లో పెట్టింది.అక్కడ సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం లాంటి స్టార్స్ తో జత కడుతుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు రష్మిక మందన కూడా బాలీవుడ్ లో జెండా పాతేస్తే ఇండియన్ వైడ్ స్టార్ గా మారిపోవచ్చని భావిస్తుంది.ఈ నేపధ్యం అవసరం అయితే ముంబై షిఫ్ట్ అయ్యేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు బోగట్టా.
తాజాగా ఈ భామ హిందీలో మూడో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ విషయాన్ని సోషల్ మీడియా చాట్ లో రివీల్ చేసింది.
త్వరలో మూడో హిందీ సినిమాకి సైన్ చేయబోతున్నా అని ఫ్యాన్స్ తో తన సంతోషాన్ని పంచుకుంది.దీనిని బట్టి బాలీవుడ్ దర్శకులకి కూడా రష్మిక క్రష్ పట్టుకుందనే టాక్ వినిపిస్తుంది.