ముంబైలో కొత్త ఇల్లు కొన్న క్రేజీ హీరోయిన్ రష్మిక

సౌత్ ఇండియాలో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన.ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో పుష్ప సినిమాతో పాటు శర్వానంద్ కి జోడీగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తుంది.ఈ రెండు సినిమాలలో ఒకటి షూటింగ్ దశలో ఉంది.ఇదిలా ఉంటే మరో వైపు ఈమె తమిళంలో చేసిన మొదటి సినిమా సుల్తాన్ రిలీజ్ కి రెడీ అవుతుంది.

 Rashmika Mandanna Purchased Apartment In Mumbai, Tollywood, Pushpa Movie, Missio-TeluguStop.com

మరో వైపు బాలీవుడ్ లోకి ఈ అమ్మడు అడుగు పెట్టింది మిషన్ మజ్ఞు అనే సినిమాలో సిద్దార్ద్ మల్హోత్రాకి జోడీగా రష్మిక నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబై పరిసరాలలో జరుగుతుంది.

దీని తర్వాత అమితాబచ్చన్ కాంబినేషన్ లో మరో సినిమాలో నటించడానికి రష్మిక మందన సైన్ చేసినట్లు ఇప్పటికే టాక్ వినిపిస్తుంది.దీంతో పాటు కొన్ని ప్రాజెక్ట్ లో చర్చల దశలో ఉన్నాయని బిటౌన్ లో వినిపిస్తున్న సమాచారం.

ఈ నేపధ్యంలో ఈ అమ్మడు ముంబైలో మకాం వేయడానికి సొంతంగా ఒక ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.ముంబై షూటింగ్ కి వెళ్ళిన ప్రతిసారి హోటల్ లో ఉండటం అంటే కాస్తా ఇబ్బందికరంగా ఉండటంతో పాటు ఖర్చుతో కూడుకున్న పని.దీనిని దృష్టిలో ఉంచుకొని హిందీ సినిమా అవకాశాలు మిస్ కాకుండా ఉండటం కోసం ముంబైలో ఖరీదైన ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ ని కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తుంది.హైదరాబాద్ తో పాటు ముంబైలో కూడా సొంత ఇల్లు ఉంటే సినిమా షూటింగ్ ల బట్టి మకాం మార్చడానికి అవకాశం ఉంటుందని ఈ విధంగా కన్నడ భామ ప్లాన్ చేసుకుందని తెలుస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube