చలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకుని ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అతి తక్కువ సమయంలోనే ఎన్నో అద్భుతమైన అవకాశాలను అందుకుని ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.వరుసగా బాలీవుడ్ ఆఫర్లు దక్కించుకుని ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
రష్మిక తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా ఈమె ప్రేమ బ్రేకప్ తో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.
ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో రష్మిక రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తుంటా”లైగర్సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం ఓ షెడ్యూల్ ను గోవాలో చిత్రీకరిస్తున్నారు.
ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ గోవాలో ఉండగా తాజాగా రష్మిక కూడా గోవా వెళ్లినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమె షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా రష్మిక గోవాలో ఎప్పుడైతే ఇల్లు ఉంటుందో అప్పుడే అసూయగా ఉంటుందా? అని ఉన్న పోస్ట్ షేర్ చేయడంతో గోవాలో ఈ బ్యూటీ కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ఈ పోస్ట్ చూస్తుంటే ఈ ముద్దుగుమ్మ అడ్రస్ గోవాకి మారనుందా అంటూ నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ గోవాలో ఉండటం చేత వీరి రచ్చ మామూలుగా ఉండదని తెలుస్తోంది.ఇక రష్మిక అల్లు అర్జున్ సరసన పుష్ప అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు.
అదేవిధంగా శర్వానంద్ హీరోగా “ఆడాళ్ళు మీకు జోహార్లు” అనే సినిమాలో కూడా రష్మిక నటిస్తున్నారు.