టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన.ఈ అమ్మడు ఓ వైపు తెలుగు సినిమాలు చేస్తూనే మరో వైపు బాలీవుడ్ లో కూడా పాగా వేయడానికి కావాల్సిన రూట్ మ్యాప్ రెడీ చేసుకుంది.
ఇప్పటికే రెండు సినిమాలని హిందీలో స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ మరో భారీ బడ్జెట్, స్టార్ హీరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఆ మూడు సినిమాలు హిట్ అయితే బాలీవుడ్ లో కూడా రష్మిక హవా మొదలైపోతుందనే టాక్ వినిపిస్తుంది.
ఈ నేపధ్యంలో సౌత్ లో కూడా మినిమమ్ స్టార్ హీరోలతోనే జత కట్టడానికి రష్మిక ఆసక్తి చూపిస్తుంది.ఈ నేపధ్యంలో తమిళ్ లో ధనుష్, సూర్య, విశాల్ లాంటి హీరోలు రష్మిక డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సౌత్ లో రష్మికకి ఉన్న క్రేజ్ తో కమర్షియల్ యాడ్స్ చేసే అవకాశాలని కూడా సొంతం చేసుకుంటుంది.
సౌత్ లో పాటు, హిందీలో కూడా అందరికి రష్మిక చేరువ కావడంతో ఇప్పుడు బడ్జెట్ పరిమితుల కారణంగా స్టార్ హీరోయిన్స్ దగ్గరకి వెళ్ళలేని వాళ్ళు రష్మికని ఆశ్రయిస్తున్నారు.
తమ ఉత్పత్తుల కోసం ఈ బ్యూటీని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుంటున్నారు.ఇప్పటికే చాలా బ్యూటీ ప్రొడక్ట్స్, అలాగే లైఫ్ స్టైల్ స్టోర్స్ కి రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని తెలుస్తుంది.
ఇలా కమర్షియల్ యాడ్స్ ద్వారా ఈ బ్యూటీ రెండు చేతులా సంపాదిస్తుందని సమాచారం.ఈ ఏడాది ఆమె సంపాదన 29 కోట్ల వరకు ఉంటుందని అంచనా.దీనిని బట్టి సౌత్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లలో రష్మిక మందన అత్యధిక సంపాదన కలిగి ఉన్న బ్యూటీగా కొనసాగుతుందని తెలుస్తుంది.కమర్షియల్ యాడ్స్ విషయంలో కూడా పూజాహెగ్డే, రష్మిక మధ్య పోటీ నడుస్తుందని బోగట్టా.