టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న కన్నడ కుట్టి రష్మిక మందన.ఈ అమ్మడు మొదటి సినిమా చలోతో హిట్ కొట్టి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా కెరియర్ లో జెట్ స్పీడ్ తో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి వచ్చేసింది.
ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో జత కట్టే అవకాశం చాలా వేగంగా సొంతం చేసుకుంది.ప్రస్తుతం పుష్ప మూవీలో అల్లు అర్జున్ కి జోడీగా నటిస్తుంది.
దీంతో పాటు హిందీలో ఏకంగా మూడు సినిమాలు లైన్ లో పెట్టింది.
వాటిలో రెండు సెట్స్ పైకి వెళ్ళిపోయి షూటింగ్ దశలో ఉన్నాయి.అలాగే తమిళ్ లో సుల్తాన్ మూవీతో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా క్రేజీ హీరోయిన్ గా ఆఫర్స్ దక్కించుకుంటుంది.సూర్య, విశాల్, విజయ్ లాంటి స్టార్ హీరోలకి జోడీగా ఈమెని తీసుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే గత ఏడాది సౌత్ లో మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్ గా రష్మిక గుర్తింపు దక్కించుకుంది.అయితే మరో సారి ఈ ఫీట్ ని ఈ ఏడాది కూడా ఈ బ్యూటీ అందుకుంది.
బెంగుళూరు టైమ్స్ సర్వేలో ఈ ఏడాది టాలీవుడ్ లో మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్ గా రష్మికకి ఎక్కువ మంది ఓటు వేశారు.పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా ఉన్న ఆమెని కాదని నెటిజన్లు రష్మికకి పట్టం కట్టారు.
దీనిని బట్టి ప్రస్తుతం ఆమె క్రేజ్ ఈ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.