త్రివిక్రమ్ సినిమా నెక్స్ట్ సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ పూర్తవగానే ఈ సినిమాని తారక్ సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడు.
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు.ఇక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ డ్రామాతో ఈ సినిమాకి త్రివిక్రమ్ తన స్టైల్ లోనే సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం అయిపోయిందని, ఇక ఎన్టీఆర్ ఒకే అనగానే సెట్స్ పైకి వెళ్ళిపోవడానికి త్రివిక్రమ్ సిద్ధంగా ఉన్నట్లు బోగట్టా.ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి.
పూజా హెగ్డేని ఇందులో కూడా గురూజీ కొనసాగిస్తాడనే చర్చ నడిచింది.ఆమె కూడా చూచాయగా ఆ విషయం చెప్పింది.
అయితే ఆమె తెలుగు, హిందీ, తమిళ్ లో వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది.ఈ నేపధ్యంలో కైరా అద్వానీ పేరుని పరిశీలిస్తున్నట్లు టాక్ నడిచింది.
బాలీవుడ్ లో ఆమె బిజీ హీరోయిన్ కాబట్టి పాన్ ఇండియాకి కొంత వర్క్ అవుట్ అవుతుందని భావిస్తున్నారనే మాట బలంగా వినిపించింది.
తరువాత జాన్వీ కపూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది.
మధ్యలో రష్మిక పేరు వినిపించిన తరువాత ఆమె గురించి ఎవరూ పట్టించుకోలేదు.అయితే ఊహించని విధంగా మరల రష్మికని ఎన్టీఆర్ కి హీరోయిన్ గా తెరపైకి వచ్చింది.
తాజాగా ఈ భామ మిషన్ మజ్ఞూ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్ లో అడుగుపెట్టింది.హైదరాబాదుకు చేరుకున్న రష్మిక నిన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కలిసినట్టు చెబుతున్నారు.
ఈ సినిమా విషయంపై చర్చించడానికే ఆమె ఆయనను కలిసినట్టు సమాచారం.ఆమె ఎంపికపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుంది.
.