ఛలో సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన తొలి సినిమాతో అదిరిపోయే హిట్ అందుకుంది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలవడంతో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ వచ్చింది ఈ బ్యూటీ.
గీతా గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలతో ఆమె టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది.ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప చిత్రంలో నటిస్తోంది.
కాగా లాక్డౌన్ కారణంగా రష్మిక కర్ణాటకలోని తన ఇంటికే పరిమితం అయ్యింది.అందరికీ లాక్డౌన్తో కష్టాలు ఎదురవుతుంటే, రష్మిక మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తోందట.తనకు ఈ లాక్డౌన్ బాగా కలిసొచ్చిందని ఆమె అంటోంది.తన కుటుంబ సభ్యులతో ఇంత సమయం తానెప్పుడూ గడపలేదని ఆమె అంటోంది.
అయితే ఈ బ్యూటీ లాక్డౌన్లో కేవలం ఎంజాయ్ మాత్రమే చేయడం లేదట.తన బాధ్యతగా తన దగ్గర పనిచేస్తున్న వారికి అండగా కూడా ఉంటోందట.
రష్మిక వద్ద పనిచేస్తున్న స్టాఫ్, తన తండ్రి దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ మొత్తం 20 మంది నిత్యావసరాలను ఆమె నాలుగు నెలలుగా చూస్తోందట.అంతేగాక తమ స్టాఫ్ కుటుంబ సభ్యులను కూడా ఆమె పోషిస్తోన్నట్లు తెలుస్తోంది.
వారు తమ వద్ద పనిచేస్తుండటంతో, లాక్డౌన్ కారణంగా వారందరూ ఉపాధి కోల్పోయారు.అయితే వారికి తనవంతు బాధ్యతగా వారి బాగోగులు చూస్తోందట.
ఇలా తన స్టాఫ్ గురించి ఇంత బాధ్యతగా ఉన్న రష్మిక మిగతా వారికి స్పూర్తిగా నిలుస్తోందని పలువురు ఆమెను మెచ్చుకుంటున్నారు.