టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన ఇప్పటికే బాలీవుడ్ లోకి కూడా మిషన్ మజ్ఞు సినిమాతో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.సిద్దార్ద్ మల్హోత్రాకి జోడీగా ఈ మూవీలో రష్మిక కనిపించబోతుంది.
దీంతో పాటు అమితాబచ్చన్ మనవరాలుగా గుడ్ బై అనే సినిమా చేయబోతుంది.దీంతో పాటు మరో సినిమాకి కూడా హిందీలో సైన్ చేసింది.
ఇక తెలుగులో పుష్పతో పాటు, ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలు చేస్తుంది.తెలుగులో కొత్తగా మరో ప్రాజెక్ట్ ని ఆమె ఒప్పుకోలేదు.
తమిళ్ లో మాత్రం సినిమాలు చేయడానికి కొత్త కథలు వింటుంది.తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాకే ఈ బ్యూటీ తన సొంత గొంతు వినిపించింది.
తెలుగు మీద పట్టు సంపాదించి తన క్యారెక్టర్ కి తానే డబ్బింగ్ చెప్పుకుంది.
ఇక హిందీలో కూడా తన క్యారెక్టర్ కి తానే డబ్బింగ్ చెప్పుకోవాలని రష్మిక భావిస్తుంది.
దీనికోసం ప్రత్యేకంగా హిందీ ట్యూటర్ ని కూడా నియమించుకొని పాఠాలు నేర్చుకుంటుందని తెలుస్తుంది.ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు లేకపోవడం ఈ బ్యూటీ పేరెంట్స్ తో కలిసి సొంతఊరిలో ఉంటుంది.
ఈ సమయాన్ని ఫుల్ గా ఉపయోగించుకొని హిందీలో పట్టు సంపాదించే ప్రయత్నం రష్మిక మందన చేస్తుందని తెలుస్తుంది.మొత్తానికి ఈ జెనరేషన్ లో సాయి పల్లవి, పూజా హెగ్డే, రష్మిక మందన లాంటి అందాల భామలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినా కూడా సినిమాలు చేస్తున్న బాషలపై పట్టు సంపాదించి సొంత గొంతు వినిపించడానికి ఆసక్తి చూపిస్తూ ఉండటం నిజంగా విశేషం అని చెప్పాలి.