టాలీవుడ్లో ఛలో సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.ఇప్పటికే ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలువగా, రీసెంట్గా ఆమె నటించిన సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ను షేక్ చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ, ఈ సినిమా హిట్ కావడంతో స్టార్ స్టేటస్ను సాధించుకుంది.
ఇక దీంతో ఇప్పుడు మరో స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అమ్మడి పాత్ర అద్భుతంగా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇక ఈ బ్యూటీ, తాజాగా ఓ ఫ్లాప్ మూవీకి తెగ భజన చేస్తోంది.
అందాల భామ కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పెంగ్విన్’ ఇటీవల అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది.
అయితే ఈ సినిమా అదరగొట్టిందంటూ రష్మిక తాజాగా సోషల్ మీడియాలో భజన మొదలుపెట్టింది.
కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రాన్ని తాజాగా ఆమె చూసిందని, ఈ సినిమా కథ సూపర్గా ఉండటంతో ఆమెకు ఈ సినిమా తెగ నచ్చేసిందని చెప్పుకొచ్చింది.
ఇక కీర్తి సురేష్ తల్లి పాత్రలో చేసిన యాక్టింగ్కు తాను ఫిదా అయ్యానంటూ కీర్తిని పొగడ్తలతో ముంచెత్తింది.అయితే ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించని ఈ సినిమాకు రష్మిక ఎందుకు ఇంతలా భజన చేస్తుందా అని ప్రేక్షకులు ఆమెను ప్రశ్నిస్తున్నారు.
ఏదేమైనా సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈ భజన చేసుంటే కాస్తో కూస్తో సినిమాకు కలిసొచ్చేదని చిత్ర వర్గాలు అంటున్నాయి.