రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ సినిమా తర్వాత శివ నిర్వాణ డైరక్షన్ లో ఖుషి సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాలో విజయ్ సరసన సమంత జోడీగా నటిస్తుంది.ఇక ఈ సినిమా తో పాటుగా పూరీ జగన్నాథ్ డైరక్షన్ లోనే జన గణ మన సినిమా సెట్ చేసుకున్నాడు విజయ్.
ఆ సినిమా కూడా ఇప్పుడు సెట్స్ మీద ఉంది.
లైగర్ రిలీజ్ అవకుండానే పూరీతో ఉన్న రిలేషన్ కొద్దీ ఆయనతో జన గణ మన సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.
ఈ సినిమా లో బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.విజయ్ దేవరకొండ పూజా హెగ్దే ల జోడీ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఉంది.
జన గణ మన సినిమాలో పూజా హెగ్దేతో పాటుగా రష్మిక కూడా నటిస్తుందట.అయితే రష్మిక సినిమాలో హీరోయిన్ గా కాదు ఓ స్పెషల్ సాంగ్ కోసం వస్తుందట.
విజయ్ దేవరకొండ రష్మికల జోడీ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇద్దరు కలిసి చేసిన గీతా గోవిందం సూపర్ హిట్ కాగా.ఆ సినిమాతో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.ఆ తర్వాత డియర్ కామ్రెడ్ అని చేసినా వర్క్ అవుట్ కాలేదు.
అయితే ఈసారి విజయ్ కోసం ఐటం సాంగ్ కోసం రెడీ అయ్యింది రష్మిక మందన్న. విజయ్ రష్మికల జోడీని స్క్రీన్ మీద చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
అయితే అది జన గణ మన కోసం సెట్ చేస్తున్నారు.విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరు కలిసి ఓ సాంగ్ చేస్తే మాత్రం జన గణ మన సినిమాక్ అదే హైలెట్ అవుతుందని చెప్పొచ్చు.
ఇక తన సినిమాల లైనప్ తో తన ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ.లైగర్, ఖుషి, జన గణ మన ఈ సినిమాలతో తన ఫ్యాన్స్ ని అలరించనున్నాడు విజయ్.