నేచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘వి’ ఇటీవల అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు పట్టం కట్టారు.
అయితే కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.దీంతో ఈ సినిమా యావరేజ్ మూవీగా నిలిచింది.
ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు నాని ఇప్పటికే రెడీ అయ్యాడు.టక్ జగదీష్ అనే సినిమా షూటింగ్ను గతంలోనే ప్రారంభించిన నాని, ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు.
కాగా తన నెక్ట్స్ చిత్రాన్ని ‘టాక్సీవాలా’ చిత్ర డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయిన నాని, ఈ సినిమా షూటింగ్ను త్వరలో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.శ్యామ్ సింఘ రాయ్ అనే టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారా అనే అంశం ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి నెగెటివ్ పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాలో హీరోయిన్గా కన్నడ కుట్టి రష్మిక మందనను ఎంపిక చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది.దీంతో నాని సినిమాలో రష్మిక పాత్ర ఎలా ఉంటుందా అనే సర్వత్రా ఆసక్తిగా మారింది.
ఇక ఈ సినిమాలో నాని పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.అయితే ఈ సినిమాలో రష్మిక నటించే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఏదేమైనా నాని-రష్మిక మందన కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.