టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి రష్మిక మందన.చలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి వరుస హిట్స్ తో ఈ అమ్మడు దూసుకుపోతుంది.
చలో తర్వాత గీతాగోవిందం, డియర్ కామ్రేడ్, దేవదాస్, భీష్మ, సరిలేరు నీకెవ్వరూ సినిమాలని ఈ అమ్మడు పూర్తి చేసింది.వీటిలో డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అయినా నటిగా మాత్రం రష్మికకి ప్లస్ అయ్యింది.
దేవదాస్ తో రష్మికకి ఎలాంటి గుర్తింపు రాలేదు.అయితే ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ రెండు హిట్స్ ని ఖాతాలో వేసుకుంది.
అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఒకటి కావడం విశేషం.ఇక ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో పుష్ప సినిమాతో పాటు శర్వానంద్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు చేస్తుంది.
మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.ఇక హిందీలో మిషన్ మజ్ను సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది.
మరో వైపు అమితాబచ్చన్ కూతురుగా ఒక సినిమాలో నటించేందుకు ఒకే చెప్పింది.
ఇక ఫుల్ జోష్ తో రష్మిక కెరియర్ దూసుకుపోతుంది.స్టార్ హీరోలు అందరూ రష్మిక కోసం ట్రై చేస్తున్నారు.అలాగే కుర్ర హీరోలు కూడా రష్మికతో రొమాన్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ నేపధ్యంలో రీసెంట్ గా ఈ అమ్మడు గూగుల్ మోస్ట్ ట్రెండింగ్ హీరోయిన్ గా రష్మిక గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పుడు మరో గుర్తింపుని అమ్మడు సొంతం చేసుకుంది.
ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ గా రష్మిక నిలిచింది.ఈమె రెండు సినిమాలు లాక్ డౌన్ కి ముందే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి.
ఈ నేపధ్యంలోనే ఆమెకి ఈ గుర్తింపు లభించింది.