కన్నడ గ్లామరస్ బ్యూటీ రష్మిక మందన్న సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకు పోతుంది.
ఇక ఈ బ్యూటీ మరొకసారి వార్తల్లో నిలిచింది.తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్న పిక్స్ వల్ల మరొకసారి రష్మిక హాట్ టాపిక్ అయ్యింది.
తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని పిక్స్ షేర్ చేస్తూ ఎక్కడికి వెళ్తునాన్నో కనుక్కోండి చూద్దాం.అంటూ అభిమానులకు ఛాలెంజ్ విసిరింది.
ఇక రష్మిక నెక్స్ట్ అప్డేట్ కోసం అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.ఆమె తన పిక్స్ తో పాటు విమాన ప్రయాణం, పాస్ పోర్ట్ ఫొటోలను షేర్ చేస్తూ ”ఈసారి మీకు చాలా దూరంగా వెళ్తున్న.
త్వరలోనే తిరిగి వస్తాను” అని చెప్పుకొచ్చింది.ఇక ఈ పోస్ట్ పెట్టినప్పటి నుండి రష్మిక ఎక్కడికి వెళ్ళింది.ఎవరిని కలవడానికి వెళ్ళింది.అని ఆరా తీయడం మొదలు పెట్టారు.
ఇక ఆరా తో పాటు కొన్ని గాసిప్స్ కూడా వస్తున్నాయి.
రష్మిక యూఎస్ వెళ్లిందని.అక్కడే విజయ్ దేవరకొండ లైగర్ సినిమా షూటింగ్ జరుగుతుంది.కాబట్టి అక్కడికి రష్మిక తన స్నేహితుడు అయిన విజయ్ ను కలవడానికి వెళ్లిందని ప్రచారం జరుగుతుంది.
ఇంకొక వైపు రష్మిక లైగర్ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించ బోతుందని.ఆ షూట్ కోసమే వెళ్లిందని చెప్పుకుంటున్నారు.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి ఇప్పటికే రెండు సినిమాలు చేసారు.గీత గోవిందం సినిమాతో మంచి హిట్ కొట్టిన ఈ జంట రెండవ సినిమాగా వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా మాత్రం కొద్దిగా నిరాశ పరిచింది.అయితే విజయ్, రష్మిక మంచి స్నేహితులు.అంతేకాదు వీరిద్దరూ ప్రేమించు కుంటున్నారని వార్తలు ఎప్పటి నుండో మీడియాలో వస్తూనే ఉన్నాయి.కానీ వీరిద్దరూ ఎప్పుడు వాటి గురించి స్పందించలేదు.ఇక తాజాగా మరొక సారి వీరిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు.