ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న.కెరీర్ మొదట్లో రష్మిక నటించిన సినిమాలన్నీ హిట్ కావడంతో ఆమెకు స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తున్నాయి.
సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ కు జోడీగా నటించి మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న రష్మిక ప్రస్తుతం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తోంది.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక చిత్తూరు యాసలో మాట్లాడనుంది. తాజాగా ట్విట్టర్ ద్వారా లైవ్ సెషన్ లో పాల్గొన్న రష్మిక కీలక విషయాలను వెల్లడించింది.#rushhour అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా ప్రశ్నించమని నెటిజన్లను కోరగా ఒక నెటిజన్ హోటల్ నుంచి ఏదైనా దొంగలించారా అని ప్రశ్నించాడు.
ఆ ప్రశ్నకు రష్మిక స్పందిస్తూ నేను చెప్పే సమధానంతో చాలామంది సంతోషిస్తారని.తనకు హోటల్ లో ఉండే షాంపూలు ఎంతో నచ్చుతాయని.ఒకసారి పిల్లో కవర్ కూడా నచ్చడంతో దొంగలించానని వెల్లడించారు.
అయితే ఇలా దొంగతనాలు చేయడంపై అపరాధ భావంతో ఉన్నానని ఆమె పేర్కొన్నారు.
హైపర్ గా ఉండటం, ఎక్కువగా ఆందోళన పడటం, ప్రతి చిన్న విషయానికి నవ్వడం లాంటి అలవాట్లు తనను విపరీతంగా బాధిస్తాయని తెలిపారు.తనకు సౌకర్యంగా ఉండే దుస్తులు ఎంతో ఇష్టమని బయటకు వెళ్లే సమయంలో గౌన్ ను ఎక్కువగా ఎంచుకుంటానని అన్నారు.
రివ్యూలు చదవడం తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు.
కరోనా, లాక్ డౌన్ గురించి స్పందిస్తూ ఇది కష్టంతో కూడుకున్న సమయమని.
పరిస్థితులు చక్కబడిన తరువాత సమయాన్ని భవిష్యత్తుకు ఉపయోగపడే పనుల కోసం కేటాయించాలని అన్నారు.తాను చాలా మంచి విద్యార్థినని కానీ చదవనని.
తన తల్లిదండ్రులు ఎక్కువగా చదవకపోవడం వల్లే చెడు విద్యార్థినిని అయ్యానని సరదాగా చెప్పారు.ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన ముఖంపై చిరునవ్వు ఉంటుందని రష్మిక అన్నారు.