యంగ్ హీరో నాగశౌర్య నటించిన ఛలో సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మందన ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ వస్తోంది.గీతా గోవిందం సినిమాతో అమ్మడి క్రేజ్ ఒక రేంజ్కు చేరుకుంది.
ఆ సినిమాతో అమ్మడు ఒక్కసారిగా స్టార్ స్టేటస్ను సంపాదించేసుకుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అంతలా ఆ సినిమా సక్సెస్ సాధించింది.
ఇక ఇప్పుడు మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కూడా రష్మిక నటిస్తోంది.
కాగా నేచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ మూవీ ‘జెర్సీ’ తెలుగులో ఎలాంటి సక్సెస్ సాధించిందో మనందరికీ తెలిసిందే.
ఈ సినిమా నాని కెరీర్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన శ్రద్ధా శ్రీనాధ్కు కూడా మంచి గుర్తింపు వచ్చింది.
అయితే ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.బాలీవుడ్ రీమేక్లో హీరోయిన్ పాత్రలో రష్మికను చేయాల్సిందిగా కోరారట చిత్ర యూనిట్.
దీనికి నో అని చెప్పిందట రష్మిక.ఆమె నో చెప్పడానికి కారణం కూడా ఉందని చెప్పుకొచ్చింది.
ఆ సినిమాలో నటించాలంటే చాలా ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సి ఉంటుందని, తాను అంతలా ఇన్వాల్వ్ కాలేనేమో అని భయమేసి ఆ సినిమా రీమేక్కు నో చెప్పిందట రష్మిక.నాని నటించిన జెర్సీ సినిమాను బాలీవుడ్లో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నాడు.
గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకుర్ హీరోయిన్గా నటించనుంది.మొత్తానికి నాని చేసిన సినిమాకు నో చెప్పిన రష్మికపై నాని ఫ్యాన్స్ కాస్త గుర్రుగానే ఉన్నారు.