రష్మిక మందన్న.కన్నడ సినీ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ సంపాదించి సూపర్ హీరోయిన్ గా పేరు పొందిన ఈ భామ టాలీవుడ్ లో చలో అంటూ అడుగు పెట్టి కుర్రాళ్ల మనసు కొట్టేసింది.
కొన్ని ఫంక్షన్స్ లో అతిగా మాట్లాడి తారాస్థాయిలో ట్రోల్ అయినా ఈ భామ ఎట్టకేలకు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి ఛాన్స్ కొట్టేసింది.ఇక అలాంటి ఈ భామ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ తెరపై కనిపించబోతుంది.
బాలీవుడ్ లో వికాస్ బహ్ల్ తర్వాతి సినిమా డెడ్లీ సినిమాలో రష్మిక మందనా ను తీసుకున్నట్లు గా తెలుస్తుంది.ఫస్ట్ కత్రినా కైఫ్ ను ఈ సినిమా కు హీరోయిన్ గా తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఆమె ఆ సినిమాకు నో చెప్పింది.
దీంతో మరో హీరోయిన్ ని ప్రయత్నించగా ఆమె కూడా నో చెప్పిందని.దీంతో రష్మిక మందన ను సంప్రదించగా ఆమె ఒకే చెప్పిందని.అలా బాలీవుడ్ లో రెండో సినిమా కూడా ఫిక్స్ అయ్యింది.అయితే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూతురుగా రష్మిక కనిపించనుంది.
ఈ సినిమా కంటే ముందు రష్మిక మందాన సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్ను సినిమాలో నటించనుంది.అయితే బాలీవుడ్ లో రెండో సినిమాకు భారీగా రెమ్యునరేషన్ చెల్లిస్తున్నట్లు ఫిల్మ్ వర్గాలు చెప్పుకొచ్చాయ్.బాలీవుడ్ లోకి కొత్తగా వచ్చినప్పటికీ రష్మిక మందన కు ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయిలు భారీ రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు.దీంతో ప్రస్తుతం ఫిల్మ్ వర్గాల్లో ఈ రెమ్యూనరేషన్ పై భారీ గుస గుసలు వినిపిస్తున్నాయ్.
మరి రష్మిక మందాన ఫ్యూచర్ బాలీవుడ్ లో ఎలా ఉందొ చూడాలి.