టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన వరుస సినిమాలతో దూసుకుపోతుంది.ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు హిందీలో మూడు సినిమాలని లైన్ లో పెట్టింది.
వాటిలో పాన్ ఇండియా మూవీగా పుష్ప తెరకెక్కుతుంది.అలాగే ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా కూడా తెరకెక్కుతుంది.
ఇదిలా ఉంటే హిందీలో ఏకంగా మూడు సినిమాలని రష్మిక చేస్తుంది.వాటిలో ఒక సినిమా ఇప్పటికే సెట్స్ పై ఉండగా మరో సినిమా లాంచింగ్ కూడా జరిగిపోయింది.
ఇదిలా ఉంటే రష్మిక మొన్నటి వరకు హైదరాబాద్ లో ఉంటూ తెలుగు సినిమాల మీద ఫోకస్ పెట్టింది.అయితే హిందీలో సినిమా అవకాశాలు పెరగడంతో తెలుగు సినిమాల సంఖ్య కూడా తగ్గించేసింది.
పెద్ద స్టార్ హీరోలతో అవకాశాలు అయితే తప్ప ఒప్పుకోవడం లేదు.అలాగే రెమ్యునరేషన్ పరంగా కూడా భారీగా డిమాండ్ చేస్తుంది.
ఈ నేపధ్యంలో హిందీపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడానికి ఇప్పుడు ముంబైకి ఏకంగా మకాం మార్చేసింది.ముంబైలో ఖరీదైన ఫ్లాట్ కూడా ఒకటి కొనుగోలు చేసింది.
తాజాగా ఈ ఫ్లాట్ లోకి గృహప్రవేశం కూడా చేసింది.దానికి సంబందించిన విషయాన్ని ఈ బ్యూటీ తాను కొత్త ఇంటికి వచ్చినట్లు సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేసింది.
ఇక హిందీలో మూడు సినిమాలు లైన్ లో పెట్టగా నెక్స్ట్ కూడా కంప్లీట్ గా హిందీ సినిమాల మీదనే ఫోకస్ పెట్టాలనే ఉద్దేశ్యంతో రష్మిక ముంబైలో సెటిల్ అయినట్లు తెలుస్తుంది.ఇక తెలుగు సినిమాల కోసం కూడా ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి పోతూ ఉంటుందని దీనిని బట్టి తెలుస్తుంది.