అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న హనురాఘవపూడి ప్రస్తుతం ఒక భారీ సౌత్ ఇండియా మూవీని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.హిందీలో సైతం భారీగా ఈ సినిమాను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.ఈ సినిమా బడ్జెట్ ఏంటీ.
ఈ సినిమా స్టార్ డం ఏంటీ అనేది తాజాగా ఎంపిక అయిన హీరోయిన్స్ చెప్పకనే చెబుతున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన పూజా హెగ్డే మరియు రష్మిక మందన్నాలను నటింపజేస్తున్నారు.
వీరిద్దరికి కలిపి దాదాపుగా నాలుగు కోట్లకు పైగా పారితోషికంను ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు.ఇక ఈ సినిమాలు మలయాళ స్టార్ హీరో.మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన దుల్కర్ సల్మాన్ ను ఎంపిక చేయడం జరిగింది.ఆయనకు జోడీగా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు నటించబోతున్నారు.
ఈ సినిమాకు 40 కోట్ల బడ్జెట్ ను ఆయన ఖర్చు పెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.లై సినిమాను నితిన్ తో తీసిన ఈయన దారుణ పరాజయం పాలయ్యాడు.
ఆ సినిమాతో నిర్మాతల నెత్తిన భారీ నష్టాల మూట పెట్టాడు.అయినా కూడా ఆయన తీరు మారడం లేదు.
వరుసగా పెద్ద సినిమాలను తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో ఉన్న ఆయన నిర్మాతల నష్టాల గురించి ఎందుకు ఆలోచించడం లేదు అంటూ నెటిజన్స్ కొందరు ప్రశ్నిస్తున్నారు.అయితే అశ్వినీదత్ అంత తెలివి తక్కువగా ఏమీ నిర్ణయం తీసుకోరు.
ఆయన భారీగా ఖర్చు పెడుతున్నాడు అంటే సినిమాలో ఏదో మ్యాటర్ అయితే ఉండే ఉంటుందని అంటున్నారు.హను రాఘవపూడి ఇప్పటికి అయినా కాస్త బడ్జెట్ విషయంలో తగ్గితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.