నటి రష్మిక మందనా పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.ఛలో సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయమైన ఈ భామ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సాధించుకుంది.
ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీత గోవిందం సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే.ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ తో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
ఆ తరువాత చేసిన డియర్ కామ్రేడ్ సినిమా కొంత నిరాశపరచినా మహేష్ బాబు సరసన నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ తో అవకాశాల వెల్లువ మొదలైందని చెప్పవచ్చు.ఇక తాజాగా విరాట్ కోహ్లీపై రష్మిక మందనా సంచలన వ్యాఖ్యలు చేసింది.
రష్మిక మందనా నా ఫేవరేట్ ఐపీఎల్ టీం ఆర్సీబీ అని కాని నా ఫేవరెట్ క్రికెటర్ మాత్రం విరాట్ కోహ్లీ కాదని, నా ఫేవరెట్ క్రికెటర్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ అని కామెంట్ చేసింది.ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
విరాట్ కోహ్లీ అభిమానులు రష్మికను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక.