టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన.ఇప్పటికే సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా నటించిన ఈ భామ ప్రస్తుతం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో రొమాన్స్ కి సిద్ధమైంది.ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది.ఇక ఇందులోరష్మిక గ్రామీణ గిరిజన యువతిగా కనిపించబోతుంది.ఇదిలా ఉంటే దీంతో పాటు తమిళంలో కార్తీతో కూడా ఈ అమ్మడు జత కడుతుంది.రెండు క్రేజీ ప్రాజెక్ట్ లని చేతిలో పెట్టుకున్న ఈ భామ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవ్వాలని కలలు కంటుంది.
ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో అమ్మడుకి బయోపిక్ కథల మీద కూడా ఆసక్తి పెరిగినట్లు తెలుస్తుంది.
తనకి బయోపిక్ కథలలో నటించాలని ఉందని, ముఖ్యంగా శ్రీదేవి బయోపిక్ లో నటించే అవకాశం వస్తే ఎలాంటి ఆలోచన లేకుండా ఒకే చెప్పేస్తా అని రష్మిక చెబుతుంది.
అతిలోక సుందరిని సౌత్ లో విపరీతంగా ఆరాధించేవారు ఉన్నారు.తన నటనతో దేశ వ్యాప్తంగా విశేషంగా అభిమానులని సొంతం చేసుకున్న శ్రీదేవి పాత్రలో నటించాలంటే కచ్చితంగా ఆమెకి సరితూగే లుక్, ఆహార్యం ఉండాలి.
అయితే శ్రీదేవి బయోపిక్ చేసిన రష్మిక లాంటి షార్ట్ హీరోయిన్స్ ఆ పాత్రలో నటించిన వర్క్ అవుట్ కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ఎన్ని ఇష్టాలు ఉన్న దర్శక, నిర్మాతలు మాత్రం ఆ పాత్రలకి ఎవరైతే సరిపోతారో వారిని తీసుకుంటారు.
మరి రష్మిక బయోపిక్ కల శ్రీదేవి రూపంలో కాకపోయినా వేరొక రకంగా అయినా వర్క్ ఫుట్ నెరవేరుతుందేమో చూడాలి.