కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ బ్యూటీగా వరుస చిత్రాలతో దూసుకుపోతుంది.ఈ ఏడాదిలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ చిత్రంలో నటిస్తోంది.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా పూర్తిగాక ముందే తన నెక్ట్స్ చిత్రాలను ఓకే చేస్తూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ.
తాజాగా యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన సెలెక్ట్ అయ్యింది.ఈ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే ఇండస్ట్రీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
కాగా ఈ సినిమాలో నటించేందుకు రష్మిక మందన కళ్లు చెదిరే రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.స్టార్ బ్యూటీగా మారిన రష్మిక తన రెమ్యునరేషన్ పెంచేయడంతో ఈ సినిమాలో ఆమెను తీసుకునేందుకు చిత్ర నిర్మాతలు భారీగా చెల్లించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో రష్మిక పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, ఆ పాత్రను కేవలం రష్మికనే చేయగలదని చిత్ర యూనిట్ భావించింది.అందుకే ఎంత రెమ్యునరేషన్ అయినా పర్వాలేదని ఆమెను ఈ సినిమాలో తీసుకున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఇక ఈ సినిమాకు లేడీ ఓరియెంటెడ్ టైటల్ను పెట్టడంతో చిత్ర వర్గాల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.మరి ఈ సినిమాతో రష్మిక ఎలాంటి ఇంప్రెషన్ కొడుతుందా అని ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా శర్వానంద్ ఈ సినిమాతో మరోసారి తనదైన సక్సెస్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.