తెలుగు లో స్టార్ హీరోయిన్ గా కేవలం నాలుగైదు సినిమాల్లోనే నటించినా ఒక మంచి నటిగా మాత్రం కన్నడ భామ రష్మికా మందనా నిలిచింది.మిగతా ఇండస్ట్రీ లలో ఎలా ఉన్నా టాలీవుడ్ లో మాత్రం ఆమెకు మంచి క్రేజ్ మాత్రం ఉంది.
అయితే అలాంటి రష్మిక కు ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కి అవకాశం లభించినట్లు తెలుస్తుంది.ఇప్పటికే చాలా టాలీవుడ్ చిత్రాలు రీమేక్ చేస్తున్న విషయం విదితమే.
అయితే ఇటీవల విడుదలై విజయం సాధించిన కబీర్ సింగ్ తో షాహిద్ కపూర్ మరో టాలీవుడ్ మూవీ ని రీమేక్ చేసే పనిలో పడినట్లు తెలుస్తుంది.అయితే ఈ చిత్రం కోసం రష్మిక కు అవకాశం దక్కినట్లు తెలుస్తుంది.
ఇంతకీ ఆ చిత్రం ఏమిటంటే నాని కి ఈ ఏడాది మంచి హిట్ ని అందించిన ‘జెర్సి’ మూవీ.ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని దిల్ రాజు చూస్తున్నారు.
ఈ సినిమాలో తెలుగులో శ్రద్దా శ్రీనాద్ చేసిన పాత్రకు రష్మికను తీసుకోవాలని భావిస్తున్సట్లు సమాచారం.
ఇప్పటికే షాహిద్, మేకర్స్ ఆమెను సంప్రదించారని అంటున్నారు.అయితే ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కానీ ఆమె ఒప్పుకుంటే ఆమెకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.ఎంతో మంది ఎదురు చూసే బాలీవుడ్ ఆఫర్ ఆమెకు త్వరగా వచ్చిందనే ఇండస్ట్రీ మొత్తం టాక్.
మరి రష్మిక ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.