కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్లో దూసుకుపోతుంది.ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు, యంగ్ హీరో నితిన్ సరసన భీష్మ అనే సినిమాలతో అదిరిపోయే హిట్ అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటిస్తోంది.
కాగా ఈ సినిమా షూటింగ్లో ఇంకా జాయిన్ కాని ఈ బ్యూటీ తాను వదులుకున్న ఓ సినిమాను గుర్తుకు చేసుకుని ఫీలవుతుందట.
నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్కు జనం నీరాజనం పట్టారు.స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కిన ఈ ఎమోషన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకంది.ఇక ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేస్తుండగా బాలీవుడ్లో షాహిద్ కపూర్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.అయితే ఈ సినిమాలో హీరోయిన్గా తొలుత రష్మిక మందన్నను సంప్రదించారట చిత్ర యూనిట్.
కానీ ఈ తనకు సౌత్లో ఉన్న ప్రాజెక్ట్స్ కారణంగా డేట్ అడ్జెస్ట్మెంట్స్ విషయంలో ఇబ్బంది ఉంటుందని ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట.అయితే ఇప్పుడు ఆ సినిమాలో నటిస్తే బాగుండేది అని ఆమె ఫీల్ అవుతోందట.
జెర్సీ సినిమాను ఇటీవల చూసిన ఆమె సినిమా కంటెంట్కు బాగా కనెక్ట్ అయ్యిందట.దీంతో ఈ సినిమాను అనవసరంగా వదులుకున్నానని బాధపడుతోందట.ఏదేమైనా సినిమాను వదులుకున్న సమయంలో లేని బాధ ఇప్పుడు ఎందుకు అని పలువురు కామెంట్ చేస్తున్నారు.