చలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ రష్మిక మందన.ఈ భామ దీనికి ముందే కన్నడలో కిరీక్ పార్టీ అనే సినిమాలో నటించింది.
ఆ సినిమాలో హీరోగా రక్షిత్ శెట్టి నటించాడు.ఇక ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడం అది పెళ్లి వరకు వెళ్ళడం జరిగింది.
ఇక ఆ సినిమా సూపర్ హిట్ తర్వాత ఊహించని విధంగా ఇద్దరు నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు.అది జరిగాక రష్మికకి తెలుగులో చలో సినిమా రావడం ఈ సినిమా సూపర్ హిట్ కావడం జరిగింది.
ఆ వెంటనే గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ లో గీతాగోవిందం సినిమాలో నటించే అవకాశం రావడం, అందులో విజయ్ దేవరకొండ, రష్మిక జంటకి తెలుగు ప్రేక్షకులు ఫిదా కావడం ఒక్కసారిగా ఆమె క్రేజ్ మారిపోవడం అంతా జరిగిపోయింది.అదే సమయంలో ఊహించని విధంగా పెళ్లి పీటలు ఎక్కాల్సిన రక్షిత్ శెట్టి, రష్మిక మందన విడిపోతున్నట్లు ప్రకటించారు.
ఆ తరువాత ఈ బ్రేకప్ పై మాట్లాడిన ఇద్దరు కెరియర్ ని దృష్టిలో ఉంచుకొని విడిపోతున్నట్లు చెప్పారు.ఇక రక్షిత్ తో విడిపోవడంపై కన్నడ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసి రష్మికని విపరీతంగా ట్రోల్స్ చేశారు.
అయితే వాళ్ళిద్దరూ విడిపోవడానికి విజయ్ దేవరకొండ కారణమనే టాక్ కూడా కన్నడ నాట వినిపించింది.అయితే వాటిలో ఎలాంటి వాస్తవం లేదని తరువాత వారు తేల్చేసారు.ప్రస్తుతం రక్షిత్ శెట్టి, రష్మిక ఎవరి కెరియర్ లో వారు బిజీగా ఉన్నారు.రష్మిక తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిపోతే, రక్షిత్ కూడా తనని తను ప్రూవ్ చేసుకుంటూ స్టార్ హీరోగా ఎదురుగుతున్నాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ కన్నడ హీరో అతడే శ్రీమన్నారాయణ అనే సినిమాతో కన్నడ, తెలుగు ప్రేక్షకులని అలరించడానికి వస్తున్నాడు.ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రష్మికతో బ్రేకప్ గురించి రక్షిత్ మాట్లాడుతూ జీవితం మనకి చాలా రకాలైన అనుభవాలను పరిచయం చేస్తుంది.
అందులో మంచి ఉండవచ్చు, చెడు ఉండవచ్చు.ఏదైనా సరే స్వీకరించి ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోవాలి.
అప్పటి జ్ఞాపకాలని పట్టుకొని ఆగిపోకూడదు.నా ఆలోచన కూడా అలాంటిది కాదు.
ప్రతిదీ ఓ కారణం చేతే జరుగుతుంది.ఎదురైన అనుభవాల నుంచి మనం ఎన్నో విషయాలను నేర్చుకొని, అలాంటి అనుభవాలు ఎదురవకుండా ముందుకి పోల్వాల్సిందే అని చెప్పుకొచ్చాడు
.