ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందన ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.విజయ్ దేవరకొండతో కలిసి గీతాగోవిందం సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హీరోయిన్గా మారింది.
ఇక అటుపై వివిధ హీరోలతో సినిమాలు చేస్తూ తెలుగులో దూసుకుపోతోంది.అయితే అమ్మడికి గతంలోనే నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే.
కన్నడ హీరో రక్షిత్ శెట్టితో రష్మిక మందన నిశ్చితార్థం చేసుకుంది.అయితే తెలుగులో వరుసబెట్టి సినిమా ఆఫర్లు వస్తుండటంతో ఆ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుంది.దీంతో రక్షిత్ శెట్టి చాలా మనస్థాపానికి గురైనట్లు కన్నడ మీడియా కోడై కూసింది.ఇప్పుడు ఆ బాధ నుండి బయటపడేందుకు సినిమాలపై ఫోకస్ పెట్టిన రక్షిత్ శెట్టి పనిలో పనిగా రష్మికపై పగ తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు.
ఆయన తాజాగా నటిస్తోన్న చిత్రాన్ని తెలుగులో ‘అతడే శ్రీమన్నారాయణ’ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు.
ఇలా తెలుగులో అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న రష్మికకు అదిరిపోయే షాక్ ఇచ్చేందుకే ఇలా తన సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు రక్షిత్ శెట్టి.మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.