టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా అతి తక్కువ కాలంలో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఏకంగా రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా రష్మిక మందన ఉంది.ఈ అమ్మడు ప్రస్తుతం కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా ఉంది.
ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో పుష్ప అనే పాన్ ఇండియా సినిమాతో పాటు ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలలో నటిస్తుంది.వీటితో పాటు హిందీలో రెండు సినిమాకి సైన్ చేసింది.
అందులో ఒకటి మిషన్ మజ్ను ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యింది.ఇక తెలుగులో మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ గా ఉన్న ఈ అమ్మడు నెక్స్ట్ వెంకీ కుడుముల, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో కూడా హీరోయిన్ గా ఇంచుమించు ఖరారు అయినట్లే అని టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు కార్తి హీరోగా తెరకెక్కిన సుల్తాన్ సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఎన్నికల సెగ తగిలింది.
సుల్తాన్ నిజానికి ఏప్రిల్ రెండో తారీఖున విడుదల కావాల్సి ఉంది.అయితే ఏప్రిల్ నుంచి తమిళనాట ఎలక్షన్ ఫీవర్ మొదలవ్వనుండడంతో సుల్తాన్ విడుదలను పోస్ట్ పోన్ చేయనున్నారు.
తమిళంలో బడా స్టార్ల సినిమాలు ఆల్రెడీ పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి. శివకార్తికేయన్ తాజా చిత్రం డాక్టర్ కూడా పోస్ట్ పోన్ చేసారు.భారీ అంచనాలు ఉన్న సుల్తాన్ ఉన్నట్లుండి పోస్ట్ పోన్ అవ్వడం వలన తమిళనాట కూడా సెటిల్ అవ్వాలనే రష్మిక డ్రీమ్ కి కొద్ది రోజులు బ్రేక్ పడింది.సినిమా రిలీజ్ బ్రేక్ అయినా కూడా ఈ భామకి కోలీవుడ్ నుంచి కూడా భాగానే అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది.
హీరో సూర్య కాంబినేషన్ లో నటించే ఛాన్స్ కూడా ఈ అమ్మడుకి వచ్చినట్లు తెలుస్తుంది.ఏది ఏమైనా రష్మికకి ప్రస్తుతం గుడ్ టైం నడుస్తుంది కాబట్టి సుల్తాన్ రిలీజ్ లేట్ అయినా గ్రాండ్ ఎంట్రీ పక్కా అనే టాక్ వినిపిస్తుంది.