శంకర్ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా రష్మిక ఫిక్స్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కన్నడ భామ రష్మిక మందన వరుసగా అదిరిపోయే ఆఫర్స్ ని సొంతం చేసుకుంటూ కెరియర్ ని జెట్ స్పీడ్ తో నడిపిస్తుంది.ఇప్పటికే తెలుగులో సరిలేరు నీకెవ్వరు సినిమాతో స్టార్ హీరోయిన్ కేటగిరీలో చేరిపోయి ఏకంగా రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్పతో పాటు శర్వానంద్ జోడీగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలో నటిస్తుంది.

 Rashmika Confirmed Heroine For Ram Charan In Shankar Movie, Tollywood, Dil Raju,-TeluguStop.com

ఈ రెండు సినిమాలే కాకుండా హిందీల్ మిషన్ మజ్ఞూ సినిమాతో పాటు అమితాబచ్చన్ కాంబినేషన్ లో గుడ్ బై అనే సినిమాలో కూడా నటిస్తుంది.ప్రస్తుతం రష్మిక నటిస్తున్న మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

ఇలా తెలుగులోనే కాకుండా హిందీ సినిమాలతో బాలీవుడ్ లో కూడా ఈ కన్నడ భామ పాగా వేయడానికి రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే మరో క్రేజీ ఆఫర్ ఈ అమ్మడుని వెతుక్కుంటూ వచ్చినట్లు తెలుస్తుంది.

సౌత్ స్టార్ దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయిలలో దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుటున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన ఫైనల్ అయినట్లు తెలుస్తుంది.

రీసెంట్ గా శంకర్ రష్మికని కలిసి కథ నేరేట్ చేశారని, ఇక ఈ భామకి కథ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పెసినట్లు తెలుస్తుంది.ముందుగా ఈ సినిమా కోసం కియరా అద్వానీ కోసం ట్రై చేసిన ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉండటంతో రష్మికనే ఖరారు చేశారని సమాచారం.

ఇక ఈ సినిమా కోసం రష్మికకి రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఆఫర్ చేసారని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube