సైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప.ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఒక రేంజ్ లోకి వెళ్లాయి.
ఇప్పుడా విడుదల అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది.
దీనివల్ల ముందుగా అనుకున్న సమయానికి పుష్ప సినిమాను విడుదల చేయలేక పోతుంది చిత్ర యూనిట్.
ఈ మధ్యనే పుష్ప నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాలో పుష్ప రాజ్ గా తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ చెప్పిన మాస్ డైలాగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
మొదటిసారి అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.అదిరిపోయే సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఇప్పటికే అందరికి అర్ధం అయ్యింది.
ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ ఖర్చుతో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో రష్మిక ఒక గిరిజన యువతిగా నటిస్తున్నట్టు తెలిసింది.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో రష్మిక పుష్పాలో తన పాత్రపై ఒక క్లారిటీ ఇచ్చేసింది.
ఆమె మాట్లాడుతూ ఈ సినిమాలో రష్మిక పాత్రలో నటనకు ఆస్కారం చాలా ఉందని ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుందని తెలిపింది.ఆమె పాత్ర ఒక రేంజ్ లో ఉండబోతుందని రెండవ భాగంలో కూడా రష్మిక కనిపించనుందని ఆమె తెలిపింది.టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ తో పాటు, బాలీవుడ్ లో కూడా వరస ఆఫర్లతో బిజీగా ఉంది.మరి చూడాలి పుష్ప సినిమాలో రష్మిక పాత్ర ఏ రేంజ్ లో ఉంటుందో
.