స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నాకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతోమంది అభిమానులు ఉన్నారనే విషయం తెలిసిందే.గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న రష్మికకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
రష్మిక డిమాండ్ చేస్తే రికార్డు స్థాయిలో పారితోషికం ఇవ్వడానికి సైతం నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఛలో మూవీతో కెరీర్ ను మొదలుపెట్టిన రష్మిక స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ కు కూడా పరిచయమవుతున్నారు.ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న గుడ్ బై సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఇప్పటికే పలు కంపెనీలకు రష్మిక మందన్నా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారనే విషయం తెలిసిందే.
తాజాగా రష్మిక మందన్నా ప్రముఖ అండర్ గార్మెంట్ సంస్థలలో ఒకటైన మాచోకు సంబంధించిన ప్రకటనలో విక్కీ కౌశల్ లో కలిసి నటించింది. ఈ యాడ్ లో విక్కీ కౌశల్ అండర్ వేర్ పట్టీ కనిపించేలా యాడ్ తెరకెక్కించగా యాడ్ చూసిన ప్రేక్షకులు రష్మికను ట్రోల్ చేస్తున్నారు.ఇలాంటి చౌకబారు ప్రకటనలో నటించడం అవసరమా? అని రష్మిక గురించి నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ఇటువంటి యాడ్ల ద్వారా రష్మిక సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తున్నారంటూ నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.నెగిటివ్ కామెంట్లు, ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో రష్మిక ఈ ప్రకటన గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.రష్మిక ఇటువంటి యాడ్స్ కు దూరంగా ఉంటే మంచిదని ఆమె అభిమానులు కోరుకుంటూ ఉండటం గమనార్హం.రష్మిక ఇకపై ఎంపిక చేసుకునే బ్రాండ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.