టాలీవుడ్ మోస్ట్ ఇంటరెస్టింగ్ జోడీగా ఈ మధ్య కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నది విజయ్ దేవరకొండ, రష్మిక మందన.ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన గీతాగోవిందం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ సినిమా ఇద్దరి రేంజ్ ని అమాంతం పెంచేసింది.ఒక్కసారిగా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయారు.దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా డియర్ కామ్రేడ్ మీద ప్రేక్షకులకి అంచనాలు పెరిగిపోయాయి.అయితే ఈ సినిమా కంటెంట్ పరంగా బాగానే ఉన్న.
ప్రెజెంటేషేన్ లో లోపాలు కారణంగా బలమైన స్క్రీన్ప్ ప్లే లేకపోవడంతో ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వలేదు.దీంతో ఏవరేజ్ టాక్ తో బయటపడింది.
అయితే ఈ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ, రష్మిక జోడీకి మంచి మార్కులు పడ్డాయి.వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాలు చేస్తే వర్క్ అవుట్ అవుతాయని దర్శకులు కూడా భావిస్తున్నారు.
అయితే ప్రస్తుతం వీళ్ళు ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా ఉన్నారు.మళ్ళీ ఈ జోడీని స్క్రీన్ పై చూడాలంటే కనీసం రెండేళ్లయినా పడుతుంది.
ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలలో వీరిద్దరి కెమిస్ట్రీ చూసిన అందరికి వీరి మధ్య అంతకు మించి రిలేషన్ ఉందని అనుకునేవారు.వీరిపై రకరకాల వార్తలు కూడా ప్రసారం అయ్యాయి.
రష్మిక బ్రేక్ అప్ కి కారణం కూడా గీతాగోవిందం సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలే అనే టాక్ వినిపించింది.అయితే వీరి మధ్య మంచి స్నేహం ఉందని తాజాగా జరిగిన సంఘటన పరిచయం చేసింది.
విజయ్ తాజాగా తన తల్లి మాధవి 50వ పుట్టినరోజును సెలబ్రేట్ చేశాడు.ఈ వేడుకకు విజయ్ కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
విజయ్ ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమానికి హీరోయిన్ రష్మిక కూడా హాజరు కావడం విశేషం.ఈ పార్టీలో రష్మిక చాలా ఉత్సాహంగా పాల్గొంది.
విజయ్ ఫ్యామిలీతో కలిసి ఫొటోలు దిగింది.ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అనంతరం విజయ్ తల్లితో కలిసి దిగిన ఫొటోను రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేసింది.ఈ ఫోటోలు చూసిన వారికి విజయ్ కి రష్మిక ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయిందని చెప్పుకుంటున్నారు.