బుల్లితెర యాంకర్ రష్మీ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
అంతేకాకుండా బయట జరిగే విషయాల పట్ల బాగా స్పందిస్తుంది.సెలబ్రిటీ హోదా నే కాకుండా కొన్ని బాధ్యతలో కూడా భాగం అవుతుంది.
ఇదిలా ఉంటే తాజాగా మానవజాతి చేష్టల గురించి ఓ ఆసక్తికరమైన కామెంట్ చేసింది.
చాలా వరకు భూమిపై కొన్ని వింత ఘటనలు జరుగుతూ ఉంటాయి.
అందులో మానవ జాతికి సంబంధించినది ఒకటైతే, పంచభూతాలకు సంబంధించింది మరొకటి.కొన్ని పంచభూత వింతలకు మానవుల సంబంధం ఉంటుందని యాంకర్ రష్మీ అంటుంది.
ఇటీవలే మెక్సికోలో ఒక జరిగింది.అక్కడ పచ్చని పంట పొలాల మధ్యలో వచ్చిందా రంధ్రం ఏర్పడగా అది రోజు రోజుకు పెరుగుతూ పెద్దదిగా మారుతుందట.
ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు ఉరుములు, మెరుపుల ప్రభావం వల్ల జరిగి ఉండొచ్చని అంటున్నారు.
ఇక ఆ రంధ్రంలో నీటి బుడగలు కూడా వచ్చాయట.అది దాదాపు 300 ఫీట్ల వరకు ఉందని అంచనా వేశారు.ప్రకృతి వైపరీత్యాల నేపథ్యం వల్ల జరిగిన ఈ ఘటన గురించి అందరూ ఏమి చేయలేక పోతున్నారు.
ఇక కొందరు మానవులు చేస్తున్న కాలుష్యం వల్ల ఇలా జరిగిందేమో అని అంటున్నారు.
ఇక ఈ నేపథ్యంలో యాంకర్ రష్మీ కూడా ఈ విషయం గురించి స్పందించింది.
మానవజాతికి మరో హెచ్చరిక లా ఉంది అంటూ మనుషులు చేసే చేష్టలకు విసుగెత్తినట్టుంది.భూమాతకు కోపం వస్తున్నట్టుంది అని కామెంట్ చేసింది.
ప్రస్తుతం రష్మీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవగా నెటి జనులు రకరకాలుగా స్పందిస్తున్నారు.అంతే కాకుండా రష్మీ ప్రకృతి విషయం పట్ల బాగా స్పందిస్తుంది.ఇక తనకు జంతువులు, పక్షుల పట్ల కూడా ఎంతో శ్రద్ధ తీసుకోవడమే కాకుండా వాటికి ఏమైనా జరిగితే వెంటనే స్పందిస్తుంది రష్మీ.