ఈమద్య కాలంలో రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్లు విమర్శలకు తావిస్తున్నాయి.తాజాగా ఎన్నిక కమీషన్ తీరుపై రష్మీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెర తీశాయి.
కరోనా ప్రభావం వల్ల ఎన్నికలను నిర్వహించడం సాధ్యం కాదు అంటూ ఎన్నికల కమీషనర్ ఎన్నికలను వాయిదా వేయిస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.ఎన్నికల హడావుడి అంతా పూర్తి అయ్యి చాలా ఖర్చు చేసిన తర్వాత ఎన్నికలు వాయిదా పడటంతో అంతా కూడా అవాక్కవుతున్నారు.
ఎన్నికల వాయిదాను సీఎం జగన్ తీవ్రంగా తప్పుబడుతున్నాడు.ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదని కరోనా ఉంటే తాము ఆ విషయాన్ని చూసుకుంటాం.మీకు ఆ విషయం గురించి సంబంధం లేదు.మా ఆరోగ్య శాఖ మరియు ఇతర విభాగాలు ఆ విషయంలో చాలా అప్రమత్తంగా ఉన్నాం.
మీరు దాని గురించి ఆలోచించకుండా ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ జగన్ డిమాండ్ చేసిన విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో సీఎంగా జగన్కు మద్దతుగా రష్మీ గౌతమ్ మాట్లాడటం జరిగింది.
కరోనా భయంతో ఎన్నికలను వాయిద వేయడం సరైన నిర్ణయం కాదని చెప్పుకొచ్చింది.ఇంట్లో ఉంటే కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుందా అంది.అలాగే కరోనా భయం ఉన్నా కూడా జనాలు బయటకు రాకుండా ఉంటారా అంటూ మరో ట్వీట్లో పేర్కొంది.మొత్తానికి ఎన్నికల వాయిదా విషయాన్ని రష్మీ గౌతమ్ తప్పుబట్టింది.
అయితే రష్మీ కామెంట్స్పై కొందరు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.నీకు సంబంధం లేని ఈ విషయంలో నీ ఇన్వాల్మ్ఎంట్ ఏంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రాజకీయాల గురించి ఎక్కువగా స్పందిస్తే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నెటిజన్స్ హెచ్చరిస్తున్నారు.