జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోల ద్వారా గుర్తింపును సంపాదించుకున్న రష్మీ సుధీర్ జోడీ పెళ్లి చేసుకోవాలని ఆయా సెలబ్రిటీల అభిమానులు కోరుకుంటున్నారు.అయితే ఈ జోడీ మాత్రం రియల్ లైఫ్ లో తమ మధ్య ఏమీ లేదని చెబుతున్నారు.
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోలో రష్మీ సుధీర్ పెళ్లిముచ్చట వచ్చింది.నాన్నకు ప్రేమతో పేరుతో ఈ వారం ఈవెంట్ కండక్ట్ చేయగా కమెడియన్లతో పాటు వాళ్ల తండ్రులు కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు.
ఈ ఈవెంట్ కు సీనియర్ నటి ఇంద్రజ గెస్ట్ గా హాజరు కావడం గమనార్హం.హైపర్ ఆది మాట్లాడుతూ మా నాన్నకు గోల్డ్ అంటే చాలా ఇష్టమని తాను కెరీర్ లో స్థిరపడిన తరువాత డబ్బంతా దాచి పది వేళ్లకు పది ఉంగరాలు చేయించానని మెడలో రెండు చైన్ లు పులిగోరుతో ఉంటాయని ఆది పేర్కొన్నారు.
మా నాన్న బయటకు వెళితే హాయ్ సుబ్బారావుగారు అంటూ చేతివేళ్లను చూపిస్తూ అడుగుతారని చెప్పుకొచ్చారు.
బుల్లెట్ భాస్కర్ తండ్రి నా కొడుకు ఒక్కసారి 2,000 అడిగాడని ఆ డబ్బుతో ఉద్యోగం చేయడానికి బండి కొనుక్కుంటానని చెప్పాడని తెలిపారు.
నువ్వు ఆ రెండు వేలు ఇచ్చి 20సార్లు ఉద్యోగం ఎప్పుడు జాయిన్ అవుతావని అడిగావని చెప్పుకొచ్చారు.ఆ తరువాత బుల్లెట్ భాస్కర్ రోజూ సుధీర్ రష్మీ పెళ్లి చేసుకుంటారా.? అని అడుగుతావు కదా ఇప్పుడు వాళ్లనే అడుగు అని చెబుతాడు.నేను కాదు మీ మమ్మీ తినేస్తుంది అని బుల్లెట్ భాస్కర్ తండ్రి సమాధానం ఇస్తాడు.
ఇన్ని సంవత్సరాలు అయింది కదా పెళ్లి చేసుకో అని బుల్లెట్ భాస్కర్ తండ్రి అడగగా ఈ సంవత్సరం చేసుకోవాలని మాకు తలపోటు ఉండదని బుల్లెట్ భాస్కర్ తండ్రి చెబుతాడు.సుధీర్ ట్రై చేస్తానని చెప్పడంతో త్వరలో సుధీర్ పెళ్లికి సంబంధించిన శుభవార్త చెబుతారేమో చూడాల్సి ఉంది.