యాంకర్ రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇతర ఛానెళ్లలో ప్రసారమయ్యే షోలలో అప్పుడప్పుడూ మెరుస్తున్నారు.సుధీర్ రష్మీ జోడీ లేకపోవడం వల్ల షో రేటింగ్స్ పై ప్రభావం పడుతోంది.
వీళ్లిద్దరూ కలిసి షోలు చేస్తే బాగుంటుందని సినిమాల ఫలితాలు కూడా మారే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
అయితే తాజాగా రష్మీ ఒక సందర్భంలో చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రష్మీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చానని లెదర్ ఉత్పత్తులను నేను వాడనని అన్నారు.ఏ రంగంలో అయినా తోలుతో తయారు చేసిన ఉత్పత్తులను కొనడం లేదా వాడటం చేయవద్దని ఆమె చెప్పుకొచ్చారు.
మన దేశంలో వయోజన ఆవుల నుంచి ఎక్కువగా లెదర్ వస్తోందని రష్మీ తెలిపారు.
హిందువును అయిన నేను అలాంటి క్రూరమైన పనిని ఎప్పటికీ చేయనని ఆమె కామెంట్లు చేశారు.ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు ఉండే ఏ వస్తువును అయినా నిషేధించడం సాధ్యం కాదని ఆమె తెలిపారు.డిమాండ్, సప్లై ఆధారంగా ఇది ఆధారపడి ఉంటుందని రష్మీ చెప్పుకొచ్చారు.
లెదర్ ను నిషేధించడంతో పోలిస్తే కొనుగోలు చేయకుండా ఉంటే బాగుంటుందని ఆమె కామెంట్లు చేశారు.
రష్మీ పోస్ట్ ల గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.యాంకర్ గా సక్సెస్ అయిన రష్మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను మాత్రం వెల్లడించడానికి ఇష్టపడటం లేదు.రష్మీ రెమ్యునరేషన్ రోజుకు లక్ష రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం అందుతోంది.
రష్మీ సుధీర్ కాంబినేషన్ లో ఏదైనా షోను ప్లాన్ చేస్తే ఆ షో క్లిక్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.రష్మీ సుధీర్ స్థాయి అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.