జబర్దస్త్ ( Jabhardas ) కార్యక్రమంతో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న అనసూయ( Anasuya ) ఈ మధ్య ఆ కార్యక్రమాన్ని వదిలేసి పూర్తిగా సినిమాలకే పరిమితం అవ్వబోతున్నట్లు ప్రకటించింది.జబర్దస్త్ కార్యక్రమం విడిచిన తర్వాత ఇతర చానల్స్ లో ప్రయత్నాలు చేసింది.
కానీ అక్కడ సక్సెస్ దక్కలేదు.దాంతో సినిమాల్లోనే పూర్తిగా సమయం కేటాయిస్తుంది.
కానీ సినిమాల్లో ఆశించిన స్థాయిలో వరుస ఆఫర్స్ రావడం లేదు.దాంతో అనసూయ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మళ్ళీ మల్లెమాలలో( Mallemala ) జాయిన్ అవ్వాలని జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించాలని అనసూయ ప్రయత్నాలు చేసిందట.
కానీ మల్లెమాల వారు అనసూయను రానివ్వలేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.ఇక అనసూయ దారిలోనే ఆ మధ్య జబర్దస్త్ మరో యాంకర్ అయిన రష్మి గౌతమ్( Rashmi goutham ) కూడా సినిమాల్లో బిజీ అవ్వాలని ఆశిస్తుంది అంటూ ప్రచారం జరిగింది.
కానీ తనకు సినిమాలంటే ఆసక్తి ఉన్నప్పటికీ ప్రధాన ప్రయారిటీ మాత్రం టీవీ రంగమే అంటూ రష్మి గౌతమ్ క్లారిటీ ఇచ్చింది.తాను టీవీ రంగాన్ని వదిలి వెళ్లిపోను అంటూ స్పష్టం చేసింది.
సోషల్ మీడియా లో తన గురించి జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోనని… ప్రస్తుతానికి తన దృష్టి అంతా కూడా చేస్తున్న టీవీ కార్యక్రమాలపైనే ఉందని పేర్కొంది.అనసూయ జబర్దస్త్ కార్యక్రమాన్ని వీడి ప్రస్తుతం బాధపడుతున్న విషయం తెలిసిందే.అందుకే అనసూయ మాదిరిగా తాను తొందర పాటు నిర్ణయాన్ని తీసుకుని ప్రస్తుతం చేస్తున్న జబర్దస్త్ కార్యక్రమాన్ని వదలను అన్నట్లుగా రష్మి గౌతమ్ సన్నిహితుల వద్ద పేర్కొన్నదట.అనసూయ చేసిన తప్పు తాను చేయను అన్నట్లుగా రష్మీ గౌతమ్ సన్నిహితుల వద్ద పేర్కొందంట.
ఎన్ని సంవత్సరాలైనా కూడా బుల్లి తెరపై మాత్రమే కనిపించాలని అప్పుడప్పుడు వెండి తెరపై వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటానని అలాగే వెబ్ సిరీస్ లో కూడా నటించేందుకు తాను సిద్ధం అన్నట్లుగా రష్మి గౌతమ్ పేర్కొంది.ఎవరు ఎలాంటి ఆఫర్ ఇచ్చినా కూడా ఇతర చానల్స్ నుండి ఎంత పెద్ద డీల్ వచ్చినా కూడా తాను మాత్రం జబర్దస్త్ కార్యక్రమాన్ని వీడేది లేదని శ్రీదేవి డ్రామా కంపెనీ బదిలీది లేదని రష్మి గౌతమ్ తేల్చి చెప్పింది.