బుల్లితెరపై నిత్యం నవ్వులు కురిపిస్తూ.చూడగానే కన్నులవిందుగా అనిపించే.
ట్రెండింగ్ జంట సుధీర్-రష్మీ గౌతమ్.ఏ షోలోనైనా వారిద్దరూ ఉన్నారంటూ ఇక అభిమానులకు పండగే.
వారి మధ్య ఉన్న కో-ఆర్డినేషన్, కెమిస్ట్రీతో తెలుగు ఫ్యాన్స్ను నేటికీ అలరిస్తున్నారు.అటు జబర్దస్త్, ఇటు ఢీ పోగ్రాంలలో వీరు చేసే హంగామా అంతా ఇంతా కాదు.
ఏం చేసినా గానీ ప్రేక్షకులు మాత్రం తమ అభిమానాన్ని మాత్రం రెట్టింపుగా చూపిస్తూనే ఉన్నారు.
గత 9 సంవత్సరాల కింద నుంచి ప్రారంభమైన వీరి ప్రయాణంలో.
ఎన్నో మధురానుభూతులు, ఎన్నో స్మృతులున్నారు.అవన్నీ వారి బంధాన్ని మరింత బలపడందన్నట్టు తెలియజేసేవే.
అయితే వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రేక్షకులు ఎప్పుడో అంగీకరించారు.అందుకే వీళ్లు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఎదురుచూస్తున్నారు.
అయితే తాజాగా ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఈటీవీ తెలుగులో ప్రసారమైన ఊరిలో వినాయకుడు కార్యక్రమంలో.సుధీర్, రష్మీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.అందులో భాగంగా సుధీర్.తన 9సంవత్సరాల ప్రేమకు ముగింపు పలకమని ఓ ప్రపోజల్ తీసుకురాగా.
రష్మీ దానికి సమాధానం చెప్పలేదు.ఇదిలా ఉండగా.
అతిథులుగా విచ్చేసిన ఈ సెట్లోనే కాదు.మీ అభిమానులంతా మీరు పెళ్లి చేసుకోవాలని కోరుకొంటున్నారు.
జంట అంటే ఇలా ఉండాలని అనిపిస్తుంది.ఆన్ స్క్రీన్ మీద మీ కెమిస్ట్రీ బాగుంది.
స్క్రీన్ మీద ఎంత నటించినా ఆ రేంజ్లో వర్కవుట్ కాదు.ఎవరైనా అమ్మాయి ప్రపోజ్ చేయాలంటే దానికి ఓ మైలురాయిని సెట్ చేశావు అని రోజా అంది.
ఏది ఏమైనా రష్మీ తన మనసులో ఉన్న విషయాన్ని ఓ మాట రూపంలో చెప్పు అంటూ ఇంద్రజ కామెంట్ చేస్తే.ఏ అమ్మాయి కూడా తన మనసులో ఉన్న ప్రేమను ఇంతకంటే గొప్పగా చెప్పదు అని రష్మీ అన్నారు.
రోజా, ఇంద్రజ మాటలకు స్పందించిన రష్మీ గౌతమ్.తన మనసులో మాటను చెబుతానంటూ.సుధీర్ తనకు ప్రపోజ్ చేసిన వీడియోను చూపిస్తుంది.అంతే కాకుండా.
తొమ్మిదేళ్ల ప్రేమకు ఓ డెడికేషన్ ఇస్తున్నానంటూ రష్మీ.పలు పాటలకు అందంగా స్టెప్పులు వేసి.
లవ్ సింబల్, కలర్ పెయింటింగ్తో సుధీర్కు తన ప్రేమను వ్యక్తం చేసింది.
దీన్ని చూసిన నటి రోజా ఈ సెట్లోనే కాదు.మీ అభిమానులంతా మీరు పెళ్లి చేసుకోవాలని కోరుకొంటున్నారని.జంట అంటే ఇలా ఉండాలని అనిపిస్తుందన్నారు .ఆన్ స్క్రీన్ మీద మీ కెమిస్ట్రీ బాగుంది.స్క్రీన్ మీద ఎంత నటించినా ఆ రేంజ్లో వర్కవుట్ కాదు.
ఎవరైనా అమ్మాయి ప్రపోజ్ చేయాలంటే దానికి ఓ మైలురాయిని సెట్ చేశావు అంటూ రోజా.రష్మీని పొగడ్తలతో ముంచెత్తుతుంది.
రష్మీ తన మనసులో ఉన్న విషయాన్ని ఓ మాట రూపంలో చెప్పుమని ఇంద్రజ అడగగా.ఏ అమ్మాయి కూడా తన మనసులో ఉన్న ప్రేమను ఇంతకంటే గొప్పగా చెప్పదు అని రష్మీ సిగ్గుపడుతూ సమాధానం చెప్పింది.