టాలీవుడ్ హాట్ యాంకర్ రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఏదో ఒక సమస్య పై స్పందిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.అయితే తాజాగా ఈ అమ్మడు కరోనా వైరస్ గురించి ఓ ట్వీట్ ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.
అయితే ఇందులో రష్మి గౌతమ్ ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలతుండడంతో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ కారణంగా చాలామంది సరైన వసతులు లేక మరియు తిండి లేక ఇబ్బంది పడుతున్నారు.
దీంతో దయచేసి ఇలాంటి వాళ్లని గుర్తించి పట్టెడు అన్నం మెతుకులు పెట్టి పుణ్యం మూట కొట్టుకోవాలి అంటూ తన అభిమానులను కోరింది.దీంతో రష్మి గౌతమ్ చేసినటువంటి ఈ పనికి నెటిజన్లను బాగానే మద్దతుగా నిలిచారు.
అయితే ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఇలాంటి పోస్ట్ లు పెట్టడం మానేసి ముందు తమ చుట్టుపక్కల ఉన్న వారిని గుర్తించి వారికి సహాయం చేయాలంటే కామెంట్ చేశాడు.దీంతో యాంకర్ రష్మి గౌతమ్ స్పందిస్తూ మీరు ముందు గౌరవం ఇస్తూ ట్వీట్లు రాయడం నేర్చుకోండి అంటూ మండి పడింది.
అలాగే కనీసం నీ ట్విట్టర్ ఖాతాకి పెట్టుకున్నట్టు వంటి హీరో పేరుని అయినా గౌరవించి ఇతరులతో ఎలా మాట్లాడాలో తెలుసుకో అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.దీంతో నెటిజన్లు ఇద్దరు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేగాక పవన్ కళ్యాణ్ పేరుని తొలగించి మీ ఇద్దరు ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేసుకోవాలంటూ సూచిస్తున్నారు.అయితే ఏదేమైనప్పటికీ కొందరు మాత్రం రష్మీ గౌతమ్ ఇలా రిప్లై ఇవ్వడం లో తతప్పేమీ లేదు అంటున్నారు.అంతేగాక సమాజానికి మంచి చేయాలంటూ పిలుపునివ్వడం మంచి పద్ధతే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.అలాగే సమాజంలో మంచి, చెడులు రెండూ ఉంటాయని కాబట్టి ఇందులో మంచిని మాత్రమే గ్రహించి చెడుని దూరంగా తరిమికొట్టాలని సూచించింది.