లిక్కర్‌తో రేషన్‌కు ముడిపెట్టిన రష్మీ

ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వాలు వారిని ఆదుకునేందుకు అనేక విధాలుగా సాయం అందిస్తున్నాయి.ఇక తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ప్రజలకు ఉచిత రేషన్‌తో పాటు ఆర్ధిక సాయం కూడా చేస్తోన్న సంగతి తెలిసిందే.

 Rashmi Gautam, Liquor, Ration, Lockdown, Tollywood News-TeluguStop.com

అయితే దాదాపు 45 రోజులకు పైగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో ప్రభుత్వానికి ఎలాంటి ఇన్‌కమ్ లేదు.దీంతో దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలను తెరిచారు.

అయితే ఈ మద్యం దుకాణాలు తెరవడంతో దేశవ్యాప్తంగా ప్రజలు మద్యం కోసం ఎగబడ్డారు.

ఈ పరిస్థితి చూసిన టాలీవుడ్ యాంకర్ రష్మి గౌతమ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

ఇన్నాళ్లుగా ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యి సోషల్ డిస్టెన్స్‌ను మెయింటెయిన్ చేశారని, కానీ ఒక్కసారిగా వైన్స్ ఓపెన్ కావడంతో సోషల్ డిస్టెన్స్‌ను గాలికొదిలేశారని ఆమె మండిపడింది.ఇలాంటి వాళ్ల కోసం ప్రభుత్వాలు, అధికారులు, స్వచ్ఛంధ సంస్థలు పలు రకాలుగా సహాయ కార్యక్రమాలు చేపట్టడం శోచనీయం అని ఆమె అంటోంది.

లిక్కర్ కోసం వారి దగ్గర డబ్బు ఉన్నప్పుడు వారికి ఉచిత రేషన్ ఇవ్వడం అనవసరం అని ఆమె తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.

ఇలా రష్మి గౌటమ్ చేసిన కామెంట్స్‌పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇన్నాళ్లుగా ఇంటికే పరిమితం అయిన మందుబాబులు మద్యం దొరుకుతుందో లేదో అనే అనుమానం, ఆతృతతోనే మద్యం దుకాణాల వద్ద అలా బారులు తీరారని, అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, దీన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని పలువురు రష్మికి ఉచిత సలహాలు ఇస్తున్నారు.ఏదేమైనా రష్మి తన కామెంట్స్‌తో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube