బుల్లితెర యాంకర్ గా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సుపరిచితమైన రష్మీ గౌతమ్ గతంలో వేగంగా సినిమాలు చేసినప్పటికీ ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాలు చేస్తున్నారు.నటిగా, యాంకర్ గా బుల్లితెరపై వెండితెరపై సత్తా చాటిన రష్మీ సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ వేర్వేరు అంశాల గురించి తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఎవరైనా తప్పు చేస్తే రష్మీ సోషల్ మీడియా ద్వారా ఆ తప్పుల గురించి ప్రశ్నిస్తారు.
రష్మీ నటిగా మాత్రమే కాకుండా జంతు ప్రేమికురాలిగా కూడా ప్రేక్షకులకు సుపరిచితమనే సంగతి తెలిసిందే.
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో రష్మీ వీధి కుక్కలకు ఆహారం అందే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు.మనుషులకు ఆకలి వేస్తే నోరు తెరిచి అడగగలరని ఆయితే జంతువులు మాత్రం ఆకలి వేస్తే నోరు తెరిచి అడగలేరని రష్మీ వెల్లడించడం గమనార్హం.
తాజాగా రష్మీ నెటిజన్ షేర్ చేసిన వీడియో గురించి విచారం వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాన్ అనే ప్రాంతంలో మున్సిపల్ సిబ్బంది వీధికుక్కలను పట్టుకుంటూ ఒక వీధికుక్కను పట్టుకున్న తర్వాత ఆ కుక్కను హింసించి చంపేశారు.దాదాపు అరగంట పాటు కుక్కను చిత్రహింసలకు గురి చేసి చంపగా ఒక నెటిజన్ ట్విట్టర్ లో రష్మీ పేరును ట్యాగ్ చేస్తూ ఈ విషయాన్ని షేర్ చేశారు.ఈ వీడియో గురించి రష్మీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మానవత్వం లేని ఎంతోమంది ఆ అమానుషాన్ని అలానే చూస్తూ ఉండిపోయారని రష్మీ చెప్పుకొచ్చారు.ఈ సమయం మానవజాతి తుడిచిపెట్టుకుపోయే సమయమని రష్మీ వెల్లడించారు.ఈ భూమిపై నివశించే అర్హత మనకు లేదంటూ బాధ పడుతున్న ఎమోజీని రష్మీ అభిమానులతో పంచుకున్నారు.