పీఎం కేర్స్‌కు రష్మీ విరాళం.. ఎంతో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని అందరం కలిసి సమయస్పూర్తితో ఎదురించాలని భారత ప్రధాని నరేంద్ర మోది ఇప్పటికే పిలుపునిచ్చారు.కరోనా మరణమృదంగం వాయించక ముందే దేశంలో లాక్‌డౌన్ విధించిన దాని నియంత్రణకు ప్రధాని బాటలు వేశారు.

 Rashmi Gautam Donation To Pm Cares-TeluguStop.com

అయితే ప్రధాని విధించిన లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా నిరుపేద కూలీలు ఆకలితో అలమటిస్తున్నారు.దీంతో వారి ఆకలి తీర్చేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులు భారీ విరాళాలు అందజేస్తున్నారు.

పీఎం కేర్స్ అనే సంస్థకు ఎవరికి తోచినంత వారు విరాళం అందిస్తుండటంతో నిరుపేదల ఆకలిని తీర్చవచ్చని ప్రభుత్వం తెలిపింది.ఈ మేరకు టాలీవుడ్‌కు చెందని పలువురు ప్రముఖులు కూడా తమవంతు సాయంగా విరాళాలు అందజేస్తున్నారు.

తాజాగా బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా తనవంతు సాయంగా పీఎం కేర్స్‌కు రూ.25 లక్షల విరాళం అందజేసింది.ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్‌లో తన విరాళానికి సంబంధించిన వివరాలు తెలిపింది.అటు ఉపాధి కోల్పోయిన టాలీవుడ్ కార్మికుల కోసం సినీ ప్రముఖులు ఏర్పాటు చేసిన సీసీసీకి కూడా విరాళాలు అందజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube