బుల్లితెర యాంకర్ గా మాత్రమే కాదు వెండితెర నటిగా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు రష్మి.ఈమె యాంకర్ గా కాకముందు పలు సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు అయితే తాజాగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు రష్మి.
ఇక బుల్లితెరపై ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.ఇకపోతే ఈమె కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మూగజీవాల పట్ల ఎంతో బాధ్యతగా కూడా ఉంటారు.
జంతు ప్రేమికురాలు అయినటువంటి రష్మీ జంతువులకు ఎవరైనా హాని కలిగిస్తున్నారని తెలిస్తే మాత్రం వారి పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి శిక్ష పడే వరకు పోరాడుతూ ఉంటారు.ఇప్పటికే ఎంతోమంది వీధి కుక్కలను వేధించే వారికి తనదైన స్టైల్ లో బుద్ధి చెప్పిన రష్మీ తాజాగా మరోసారి ఇలాంటి వీడియో పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా వేదికగా కొందరు ఆకతాయి యువకులు ఒక గ్లాసులో కుక్కపిల్లకు మధ్య పోసి తాగించారు.ఈ ఫోటోలు ఎందుకు సంబంధించిన వీడియోలు రష్మి కంట పడ్డాయి.
ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా రష్మి ఈ విషయంపై స్పందిస్తూ ఇలా కుక్కపిల్లకి మందు తాగించిన వాళ్ళు ఎవరో కనిపెట్టండి వారికి తగిన శిక్ష పడాలి వెంటనే వారిని అరెస్టు చేయండి అంటూ పోస్ట్ చేశారు.ఈ క్రమంలోనే ఈ పోస్టు వైరల్ కావడంతో రష్మీ అభిమానులు దయచేసి జంతువులకు హాని కలిగించదండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.పాలు ఇచ్చేటప్పుడు పశువులు కూడా ఎంతో బాధను అనుభవిస్తాయని ఈమె పాలు పాల పదార్థాలను కూడా తీసుకోరు.ఇక మాంసాహారానికి రష్మీ పూర్తిగా దూరంగా ఉంటారు.జంతువుల పై ప్రేమతో ఇలా వేగన్ గా మారిన ఈమె ఎప్పటికప్పుడు జంతువులపై తనకు ఉన్న ప్రేమను చాటుకుంటూ ఉంటారు.