బిగ్ బాస్ సీజన్ 3 కి రంగం సిద్ధం అవుతుంది.ఈ సారి షోని మరింత ఆసక్తిగా నడిపించాలనే ఆలోచనతో బిగ్ బాస్ టీం ఇప్పటి నుంచే గట్టి కసరత్తు చేస్తుంది.
దానికి గాను ఓ వైపు కంటిస్టంట్ లని ఫైనల్ చేసే పనిలో నిర్వాహకులు ఉన్నారు.ఇప్పటికే చాలా మంది పేర్లుని పరిశీలించి అందులో కొంత మందిని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
వారిలో ముఖ్యంగా టెలివిజన్ పై హాట్ జోడీగా అందరిని ఎంటర్టైన్ చేస్తున్న జబర్దస్త్ హాట్ యాంకర్ రష్మి, సుడిగాలి సుదీర్ ని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
ఈ జోడీ హౌస్ లో ఉంటే కావాల్సినంత మాసాలాతో పాటు ఫన్ కూడా దొరుకుతుందని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.
అలాగే వీరిద్దరితో పాటు టీవి నటి హరిత, వరుణ్ సందేశ్, హేమ చంద్ర, హీరో కమల్ కామరాజు, రేణు దేశాయ్, గుత్తా జ్వాల, మనోజ్ నందన్, జబర్దస్త్ పొట్టి రమేష్, కొరియోగ్రాఫర్ రఘు, కరాటే కళ్యాణి లాంటి సెలబ్రిటీలతో పాటు సామాన్యులని కూడా తీసుకునే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది.