ఈ ఏడాదిలో జరగనున్న ఐపీఎల్ 2022 సీజన్లో రెండు జట్లు కొత్తగా చేరిన విషయం తెలిసిందే.ఈ ఫ్రాంచైజీలు మెగా వేలానికి ముందే ముగ్గురు చొప్పున ఆటగాళ్లను నేరుగా కొనుగోలు చేయవచ్చు.
పాత జట్లు రిటెన్షన్ ప్రక్రియ సమయంలో చాలామంది స్టార్ ప్లేయర్లను వదిలేశాయి.వారిలో అత్యుత్తమ ప్లేయర్లను ఎంపిక చేసుకునేందుకు లక్నో, అహ్మదాబాద్ టీంలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇందులో భాగంగా అత్యంత ఎక్కువ డబ్బులను ఆశ చూపుతున్నాయి.ప్లేయర్లు కూడా ఈ ఆఫర్లను కాదనలేక పోతున్నారు.
ముఖ్యంగా రషీద్ ఖాన్ కు రెండు కొత్త జట్లు కూడా అధిక మొత్తంలో ఆఫర్స్ అందించాయని సమాచారం.
స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ను తమ జట్టులోకి తీసుకునేందుకు ఇప్పటికే లక్నో ఒప్పందం కుదుర్చు కునేందుకు చర్చలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.
నిజానికి రిటెన్షన్ ప్రక్రియ ముందు నుంచే రషీద్ను దక్కించుకోవాలని అహ్మదాబాద్ జట్టు కూడా తన ప్రయత్నాలను ప్రారంభించింది.అయితే ఈ రెండు జట్లలో ఏ జట్టుకు రషీద్ ఖాన్ వెళ్తాడు అనేది గత కొద్ది రోజులుగా ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన వార్త వెలుగుచూసింది.అదేంటంటే, లక్నో జట్టు రషీద్ ఖాన్ ను దాదాపు ఎంపిక చేసుకుందట.అయితే అహ్మదాబాద్ ఫ్రాంచైజీ అధికారులు కూడా అతన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట.ఒకవేళ అహ్మదాబాదు టీం రషీద్ ఖాన్ను దక్కించుకుంటే.లక్నో మార్కస్ స్టోయినిస్, కగిసో రబడాలలో ఒకరిని ఎంచుకోవాలని భావిస్తోందట.అయితే దీనిపై త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
జనవరి 31వ తేదీలోగా ఈ రెండు టీంలు తాము ఎంపిక చేసుకున్న పేర్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది.
విశ్వసనీయ వర్గాల ప్రకారం, అహ్మదాబాద్ కెప్టెన్గా హార్ధిక్ పాండ్య ఎంపికైనట్లు తెలుస్తోంది.
లక్నో ఫ్రాంచైజీ కెప్టెన్గా కేఎల్ రాహుల్ ఎంపికైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.ఇక ఐపీఎల్- 2022 సీజన్కు సంబంధించిన మెగా వేలం ఫిబ్రవరి లేదా మార్చి నెల లోగా జరగనుంది.