ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిందే.రోజురోజుకు ఎన్నో కేసుల సంఖ్య, ఎన్నో మరణాల సంఖ్య వింటుంటే ఎన్నో మనసులు చలించుపోతున్నాయి.
ఇప్పటికే సరైన వైద్య సదుపాయాలు లేక ఎంతో మంది ప్రజలు అల్లాడిపోతున్నారు.ఆసుపత్రులు, బెడ్ లు సరిపోక, ఆక్సిజన్ అందక ఎన్నో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వైరస్ బాధితులు.
గత ఏడాది నుండి ఈ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది.గత ఏడాది కంటే ఈ ఏడాది దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంది.ఇప్పటికే పలుచోట్ల వ్యాక్సినేషన్ అందించగా.ఇంకా పూర్తిస్థాయిలో చాలామంది వ్యాక్సినేషన్ ను అందుకునేది ఉంది.
ఇదిలా ఉంటే ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది.కేవలం ఒక లాక్ డౌన్ లోనే ప్రజలను ఆపివేస్తుంది.
కానీ సెలబ్రెటీలు మాత్రం తమ వంతు సహాయాలతో ముందుకు వస్తున్నారు.ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటీలు ఎన్నో విధాలుగా తమకు తోచిన సహాయాన్ని అందించగా.
తాజాగా మరో నటి రాశి ఖన్నా తన వంతు సహాయం తో ముందుకు వచ్చింది.
తెలుగు సినీ నటి రాశి ఖన్నా ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అనాథలకు, బిచ్చగాళ్ల కు తమ కడుపులు ఇవ్వడానికి ముందుకు వచ్చింది.
ముంబైలో ఆకలితో అలమటిస్తూ ఉన్న రోడ్డు పక్కన నివసించేవారికి ఆహారాన్ని అందించింది.ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి తన వంతు సహాయంగా ఆహారాన్ని అందిస్తుంది.అంతేకాకుండా వీటి కోసం ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయగా.ఈ బృందం వారి కడుపు నింపడానికి పని చేస్తున్నారు.ఇక ఇవన్నీ పబ్లిసిటీ లేకుండానే ముందుకు వచ్చింది రాశిఖన్నా.అంతే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా ఎటువంటి పబ్లిసిటీ లేకుండానే తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు.