నాగ శౌర్య హీరోగా నటించిన ఊహలు గుసగుసలాడే సినిమాతో ఏడేళ్ల క్రితం హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి వరుస అవకాశాలతో బిజీగా ఉంది రాశీఖన్నా.గతేడాది ప్రతిరోజూ పండగే సినిమాతో హిట్ కొట్టిన రాశీఖన్నా ఈ సంవత్సరం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో యామిని పాత్రలో నటించి మెప్పించింది.
తమిళంలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న రాశీ తన రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఈ విషయాలతో పాటు తను చేసే సామాజిక సేవల గురించి సైతం స్పందించారు.
సినిమాలో తన పాత్రను బట్టే రెమ్యునరేషన్ తీసుకుంటానని.పాత్ర కఠినంగా ఉంటే కొంచెం ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తానని.కష్టానికి తగిన రెమ్యునరేషన్ తీసుకోవడంలో తప్పు లేదని రాశీఖన్నా చెప్పారు.అదే సమయంలో ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా చెత్త పాత్రల్లో నటించడానికి ఇష్టపడనని.
పాత్రను బట్టి రెమ్యునరేషన్ ను తీసుకుంటానని రాశీఖన్నా చెప్పుకొచ్చారు.
తనకు రెమ్యునరేషన్ విషయంలో పూర్తి స్పష్టత ఉంటుందని తెలిపారు.
సినిమాల్లో రెమ్యునరేషన్ విషయంలో నిక్కచ్చిగా ఉండడంలో తప్పేం లేదని రాశీఖన్నా చెప్పుకొచ్చారు.అయితే ఆ రెమ్యునరేషన్ సేవా కార్యక్రమాల కోసం ఎక్కువగా వినియోగిస్తానని రాశీఖన్నా తెలిపారు.
చాలామంది చిన్న పని చేసినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి, మీడియా ముఖంగా ప్రకటించి గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు.
అయితే రాశీఖన్నా మాత్రం తాను సేవా కార్యక్రమాలు చేసినా చెప్పుకోవడం పెద్దగా ఇష్టపడనని తెలిపారు.మరోవైపు అందం, అభినయం పుష్కలంగా ఉన్నా చాలామంది స్టార్ హీరోలు రాశీ ఖన్నాను పట్టించుకోవడం లేదు.ఎన్టీఆర్ రాశిఖన్నాకు జై లవకుశ సినిమాలో ఛాన్స్ ఇవ్వగా ఆ సినిమా తరువాత మరే స్టార్ హీరో రాశీకు ఛాన్స్ ఇవ్వకపోవడం ఆమె కెరీర్ కు మైనస్ గా మారింది.