అక్కినేని యువ హీరో నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ మూవీలో చైతూకి జోడీగా రాశి ఖాన్న్, మాళవిక నాయర్ నటిస్తూ ఉండగా అతనికి చెల్లిగా అవికాగోర్ కీలక పాత్రలో కనిపించబోతుంది.
ఫ్యామిలీ ఎలిమెంట్స్ , ఓ ఎన్నారై యువకుడు లైఫ్ జర్నీతో ఈ సినిమా కాన్సెప్ట్ ఉండబోతుందని ఇప్పటికే టాక్ వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తి చేసుకున్న తర్వాత కరోనా సెకండ్ వేవ్ ఉన్న సమయంలోనే థాంక్యూ చిత్ర యూనిట్ ఇటలీ వెళ్ళారు.
అక్కడ షూటింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇండియా తిరిగి వచ్చారు.ఈ షూటింగ్ లో చైతన్యతో పాటు రాశీఖన్నా కూడా పాల్గొంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఇటలీ షూటింగ్ విశేషాలని రాశీఖన్నా సోషల్ మీడియాలో పంచుకుంది.ముందుగా ఇండియా నుండి బయటికి వెళ్లాలంటే భయం వేసింది.
కానీ సినిమా కంప్లీట్ చేయాలి కాబట్టి భయంతోనే ఇటలీకి వెళ్ళాను.అయితే అక్కడ కూడా కొన్ని లొకేషన్స్ లో కరోనా కేసులు బయటపడటంతో మాకు అనుమతి లభించలేదు.
అయినా మొత్తానికి చేయాల్సిన షూట్ అంతా కంప్లీట్ చేసాం.షూటింగ్ కంప్లీట్ చేసేందుకు రోజుకు 18గంటలు కష్టపడిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది.
మొత్తానికి ఇటలీ షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొని టీం అంతా ఇండియా తిరిగి వచ్చేశారు.ఇక నాగ చైతన్య మాత్రం లాల్ సింగ్ చద్దా షూటింగ్ కోసం జాయిన్ అయినట్లు తెలుస్తుంది.