ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా.ఈ అమ్మడు మొదటి సినిమాతోనే అందరిని మెస్మరైజ్ చేసి తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా తెలుగు, తమిళం, మలయాళీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.
ఏడాదికి కనీసం రెండు నుంచి మూడు సినిమాలు రాశీఖన్నా నుంచి వస్తున్నాయి.అందులో చాలా వరకు హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి.
యంగ్ స్టార్ హీరోలతో ఎక్కువగా చేస్తున్న సక్సెస్ రేట్ ఈ భామకి బాగానే ఉంది.అలాగే కమర్షియల్ హీరోయిన్ గా చేస్తున్న సినిమాలలో మంచి పాత్రలు దొరుకుతున్నాయి.
సుప్రీమ్ సినిమాలో బెల్లం శ్రీదేవి పాత్ర ఈమెకి ఎంత గుర్తింపు తీసుకొచ్చిందో అలాగే ప్రతి రోజు పండగే సినిమాలో టిక్ టాక్ స్టార్ చేసిన క్యారెక్టర్ కూడా అంతే ఇమేజ్ తీసుకొచ్చింది.గత ఐదేళ్ల నుంచి ప్రతి సంవత్సరం రాశీఖన్నా నుంచి సినిమాలు వస్తూనే ఉన్నాయి.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఓ నాలుగు సినిమాలు ఉన్నాయి.ఇదిలా ఇప్పుడు మరో సినిమాలో రాశీ ఖన్నా అవకాశం పట్టేసింది.విజయ్సేతుపతి కథానాయకుడుగా ఢిల్లీ ప్రసాద్ దీనదయాళన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘తుగ్లక్ దర్బార్’. ఈ చిత్రంలో కథానాయిక అదితీరావ్ హైదరీ స్థానంలో ఇప్పుడు రాశీఖన్నాను హీరోయిన్గా ఫైనల్ చేశారు.
గతేడాది విడుదలైన సంఘతమిజాన్ చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించారు.అదితీ తుగ్లక్ దర్బార్ చిత్రం కోసం డేట్లు సర్దుబాటు చేయలేకపోవడం వల్ల రాశీఖన్నాను ఎంపిక చేశామని, ఇప్పటికే రాశీ షూటింగులో కూడా పాల్గొనడంజరిగిందని దర్శకుడు తెలిపారు.
ఇప్పటికే ఓ సాంగ్ షూట్ చేసిఅంట్లు చెప్పుకొచ్చారు.