టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి రాశీఖన్నా.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంది.ప్రస్తుతం అమ్మడు చేతిలో మూడు తమిళ సినిమాలు ఉన్నాయి.సౌత్ లో స్టార్ హీరోయిన్లు అందరూ ఈ మధ్యకాలంలో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లోకి అడుగులు వేస్తున్నారు.సమంత, తమన్నా, కాజల్ అగర్వాల్, అంజలి, అమలాపాల్ లాంటి అందాల భామలు అందరూ క్యూ కట్టేస్తున్నారు.కొత్తదనం ఉన్న పాత్రలు చేసే అవకాశం వస్తూ ఉండటంతో వెండితెర నుంచి డిజిటల్ చానల్స్ వైపు అడుగులు వేస్తున్నారు.
అక్కడ డిఫరెంట్ రోల్స్ చేస్తూ తన కెరియర్ ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పుడు ఈ దారిలోకి రాశీఖన్నా కూడా వచ్చి చేరింది.
ఈ అమ్మడు ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ఓ బిల్ లింగ్వల్ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది.
థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కే ఈ వెబ్ సిరీస్ లో షాహిద్ కపూర్ కి జోడీగా రాశీ ఖన్నాని ఫైనల్ చేశారు.ఇందులో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది.
హిందీ సినిమాతో కెరియర్ ప్రారంభించిన రాశీఖన్నా చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ హిందీలో వెబ్ సిరీస్ చేయడానికి ఓకే చెప్పడం విశేషం.ఈ మధ్య తెలుగు సినిమాలతో పాటు ఇతర బాషల మీద ఫోకస్ చేస్తున్న రాశీఖాన్నాకి ఇది అదిరిపోయే ఆఫర్ అని చెప్పాలి.