ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన అందాల భామ రాశీఖాన్నా.మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ వస్తుంది.
గ్యాప్ లేకుండా ప్రతి ఏడాది రెండు, మూడు సినిమాలు తెలుగులో రాశీఖన్నా చేస్తుంది.చాలా వరకు ఈమె చేసిన సినిమాలకి సక్సెస్ రేట్ ఉంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు చేతిలో ప్రస్తుతం మూడు తమిళ్ సినిమాలు ఉన్నాయి.అందులో హీరో సూర్యతో ఒక సినిమా చేస్తుంది.
ఆ సినిమా ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి వెళ్తుంది.మిగిలిన సినిమా షూటింగ్ లు కూడా ఈ ఏడాదిలోనే స్టార్ట్ కాబోతున్నాయి.
తాజాగా ఈ భామ మరో తెలుగు సినిమాకి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.
మాస్ రాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది.ఇందులో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లుగా డింపుల్ హయాతీ, మీనాక్షి చౌదరిని కన్ఫర్మ్ చేశారు.
అయితే ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా మరో హీరోయిన్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పుడు ఆ రోల్ కోసం రాశీఖన్నాని ఖరారు చేసినాట్లు తెలుస్తుంది.
రవితేజ, రాశీఖన్నా ఇప్పటి వరకు మూడు సినిమాలలో కలిసి నటించారు.దీంతో నాలుగో సినిమా అవుతుంది.
ఇదిలా ఉంటే తమిళంలో రిలీజ్ కానీ సతురంగ వెట్టై2 రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్.అందులో త్రిష చేసిన పాత్ర కోసం తెలుగులో రాశీని తీసుకున్నట్లు తెలుస్తుంది.
త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.ఇక ఖిలాడీ సినిమా నుంచి జనవరి 1న ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.
ఇది సినిమా మీద హైప్ క్రియేట్ చేసింది.
.